PHPWord

 

 

 

التَّحْذِيرُ مِنَ البِدَعِ

 

కొత్త ఆచారాల(బిద్అత్ల) నుండి హెచ్చరిక

 

 

لِسَمَاحَةِ الشَّيْخِ العَلَّامَةِ

عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللهِ بْنِ بَازٍ

رَحِمَهُ اللهُ

 

 

రచన గౌరవనీయులైన షేఖ్

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్

 


بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

ఐదవ సందేశము:

మహాప్రవక్త జన్మదినోత్సవం మరియు ఇతర జన్మదినముల ఉత్సవాలకు సంబంధించిన ఆదేశము

స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, దైవ ప్రవక్తపై, ఆయన కుటుంబముపై, ఆయన అనుచరులపై, ఆయన మార్గమును అనుసరించిన వారిపై శుభాలు, శాంతి కురియుగాక.

దీని తరువాత: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజు (మీలాదున్నబీ) జరుపుకోవడం, ఆ సందర్భంలో ఆయనకు నిలబడి సలాం చెప్పడం మరియు జన్మదిన వేడుకలలో చేయబడే ఇతర కార్యాల గురించి అనేకమంది నుండి ప్రశ్నలు పునరావృతమయ్యాయి.

దీనికి సమాధానం ఏమిటంటే: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజు (మీలాదున్నబీ) పండుగను జరుపుకోవడం లేదా ఇతరుల పుట్టిన రోజులను జరుపుకోవడం అనేది అనుమతించబడలేదు; ఎందుకంటే ఇది ధర్మంలో కొత్తగా ప్రవేశించిన బిద్అతులలో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దీన్ని చేయలేదు, ఆయన తరువాత వచ్చిన ఖలీఫాలు కూడా చేయలేదు, ఇతర సహాబాలు రదియల్లాహు అన్హుమ్ కూడా చేయలేదు, మరియు ఉత్తమ శతాబ్దాలలోని వారిని అనుసరించిన తాబియీనులు కూడా చేయలేదు. వారు సున్నతులలో అత్యంత పరిజ్ఞానం కలిగినవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగినవారు, మరియు ఆయన షరీఅతును అనుసరించడంలో వారికంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నవారు. మహోన్నతుడైన అల్లాహ్ తన స్పష్టమైన గ్రంథములో ఇలా సెలవిచ్చాడు:

﴿...وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْ...﴾

ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి.

[అల్-హష్ర్: 7] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿...فَلۡيَحۡذَرِ ٱلَّذِينَ يُخَالِفُونَ عَنۡ أَمۡرِهِۦٓ أَن تُصِيبَهُمۡ فِتۡنَةٌ أَوۡ يُصِيبَهُمۡ عَذَابٌ أَلِيمٌ﴾

...ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి. [అన్నూర్:63] అల్లాహ్ సెలవిచ్చాడు:

﴿لَّقَدۡ كَانَ لَكُمۡ فِي رَسُولِ ٱللَّهِ أُسۡوَةٌ حَسَنَةٞ لِّمَن كَانَ يَرۡجُواْ ٱللَّهَ وَٱلۡيَوۡمَ ٱلۡأٓخِرَ وَذَكَرَ ٱللَّهَ كَثِيرٗا21﴾

వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో! [అల్-అహ్'జాబ్: 21] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَٱلسَّٰبِقُونَ ٱلۡأَوَّلُونَ مِنَ ٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحۡسَٰنٖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُ وَأَعَدَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي تَحۡتَهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ100﴾

మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం). [తౌబా: 100] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾

ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3] ఈ అర్ధంలో ఆయతులు చాలా ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించబడిన హదీథులో ఆయన ఇలా సెలవిచ్చారు:

«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنهُ فَهُوَ رَدٌّ».

“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. అనగా తిరస్కరించబడుతుంది అని అర్ధం ఇంకొక హదీథులో ఇలా ఉంది:

«عَلَيْكُم بِسُنَّتِي وَسُنَّةِ الخُلَفَاءِ الرَّاشِدِينَ المَهْدِيَّينَ مِنْ بَعدِي، تَمَسَّكُوا بِهَا، وَعَضُّوا عَلَيهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُحْدَثَاتِ الأُمُورِ، فَإِنَّ كُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالةٌ».

మీరు నా విధానాన్ని (సున్నతులను), నా తర్వాత సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. దానిని గట్టిగా పట్టుకుని ఉండండి, దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్. ప్రతి బిద్అత్ మార్గవిహీనతకు నిదర్శనం. ఈ రెండు హదీథులలో బిద్అత్ ప్రవేశపెట్టడం మరియు వాటిని ఆచరించడం పట్ల తీవ్రమైన హెచ్చరిక ఉన్నది,

ఇలాంటి జన్మదినములను ప్రవేశపెట్టడం ద్వారా పరమ పవిత్రుడైన అల్లాహ్ ఈ ఉమ్మతుకు ధర్మాన్ని పూర్తి చేయలేదని, మరియు ప్రవక్త అలైహిస్సలాం ఈ ఉమ్మతు చేయవలసిన పనులను పూర్తిగా తెలియజేయలేదని అర్థము చేసుకోవలసి వస్తుంది. చివరికి ఈ తరువాతి వారు వచ్చి అల్లాహ్ ధర్మంలో ఆయన అనుమతించని విషయాలను ప్రవేశపెట్టారు - ఇది వారిని అల్లాహ్ సాన్నిధ్యానికి చేరుస్తుందని భావిస్తూ. ఇది నిస్సందేహంగా ఒక ఘోర ప్రమాదం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై తీవ్రమైన అభ్యంతరం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసుల కొరకు ధర్మాన్ని సంపూర్ణం చేశాడు మరియు వారికి అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టమైన సందేశాన్ని అందించారు, మరియు స్వర్గానికి చేరుకునే మార్గాన్ని మరియు నరకం నుండి దూరంగా ఉండే మార్గాన్ని ఉమ్మతుకు వివరించకుండా విడిచి పెట్టలేదు, అబ్దుల్లాహ్ ఇబ్ను అమ్ర్ రదియల్లాహు అన్హు నుండి వచ్చిన సహీహ్ హదీథులో స్థాపించబడినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

«مَا بَعَثَ اللهُ مِن نَبِيٍ إِلَّا كَانَ حَقًّا عَلَيهِ أَن يَدُلَّ أُمَّتَهُ عَلَى خَيرِ مَا يَعْلَمُهُ لَهُم، وَيُنْذِرَهُمْ شَرَّ مَا يَعْلَمُهُ لَهُمْ».

అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఏ ప్రవక్తా తన జాతికి అతనికి తెలిసిన ఉత్తమమైన దానిని చూపించకుండా మరియు అతనికి తెలిసిన చెడు నుండి వారిని హెచ్చరించకుండా ఉండలేదు. ముస్లిం తన సహీహ్ లో ఇలా నమోదు చేసినారు.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలలో శ్రేష్ఠులు మరియు వారి పరిసమాప్తకులు. అల్లాహ్ సందేశాన్ని మరియు ఆదేశాలను సంపూర్ణంగా అందించిన వారు. మౌలిద్ ఉత్సవాలు పరమ పవిత్రుడైన అల్లాహ్ ఆమోదించిన ధర్మంలో భాగమైతే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఉమ్మతుకు వివరించి ఉండేవారు లేదా తన జీవితంలో ఆచరించి ఉండేవారు లేదా ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ దానిని ఆచరించి ఉండేవారు. కానీ అలాంటిదేమీ జరగనందున, అది ఇస్లాం లో భాగం కాదని తెలిసింది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మతును హెచ్చరించిన కొత్తగా ప్రవేశించిన వాటిలో ఒకటి, దీని గురించి ఇంతకు ముందు హదీథులలో ప్రస్తావించబడింది. ఈ అధ్యాయమునకు సంబంధించి చాలా ఆయతులు మరియు హదీథులు ఉన్నాయి.

అనేక ఉలమాలు (ఇస్లామీయ పండితులు) మీలాదున్నబీ (ప్రవక్త జయంతి) వంటి వాటిని తిరస్కరించారు మరియు వాటి నుండి హెచ్చరించారు - పైన పేర్కొన్న ప్రమాణాలు మరియు ఇతర ఇస్లామీయ సాక్ష్యాల ఆధారంగా. కానీ కొంతమంది ఆధునిక పండితులు విభేదించినారు: ఈ క్రింది నిషిద్ధ విషయాలు లేకుంటే వీటిని అనుమతించారు - వేడుకలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అతిశయోక్తి, స్త్రీ-పురుషుల కలయిక, సంగీత వాయిద్యాల వాడకం, ఇతర ఇస్లామీయ నియమాలకు విరుద్ధమైన పనులు. వారు వాటిని 'బిద్అత్ హసన' (మంచి నూతనాచారాలు) అని భావించారు.

షరీఅత్ నియమం ఏమిటంటే: ప్రజలు ఏ విషయంలోనైనా భేదాభిప్రాయాలు ఏర్పడితే, దాన్ని అల్లాహ్ గ్రంథము మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు వైపుకు మరలించాలి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡۖ فَإِن تَنَٰزَعۡتُمۡ فِي شَيۡءٖ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلًا59﴾

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది. [నిసా: 59] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَمَا ٱخۡتَلَفۡتُمۡ فِيهِ مِن شَيۡءٖ فَحُكۡمُهُۥٓ إِلَى ٱللَّهِ ...﴾

మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది... [అష్-షూరా: 10]

పుట్టినరోజుల ఉత్సవాలు జరపడాన్ని మేము తిరస్కరించాము. దీని గురించిన ఆదేశాల కోసం మేము అల్లాహ్ యొక్క గ్రంథమైన ఖుర్ఆన్‌ లో అన్వేషించాము. అప్పుడు మేము తెలుసుకున్నది ఏమిటంటే, పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తీసుకువచ్చిన విషయాలను అనుసరించమని ఆదేశిస్తున్నాడు. మరియు ఆయన మనలను ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ ఈ ఉమ్మత్‌కు తమ దీన్‌ను సంపూర్ణం చేశాడని ఖుర్ఆన్ తెలియజేస్తుంది. కానీ ఈ పుట్టినరోజు ఉత్సవం (మీలాదున్నబీ) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన దానిలో లేదు. కాబట్టి ఇది అల్లాహ్ మన కొరకు పూర్తి చేసిన ధర్మంలోని భాగం కాదు. కాబట్టి ప్రవక్తను అనుసరించమని మనల్ని అల్లాహ్ ఆజ్ఞాపించిన ఆ ధర్మంలో ఇది లేదు. ఇలా పుట్టినరోజు ఉత్సవం (మీలాదున్నబీ) అనేది ధర్మానికి సంబంధించినది కాదు అని నిర్ధారితమైనది.

మేము ఈ విషయం గురించి అంటే పుట్టినరోజు మీలాదున్నబీ ఉత్సవాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులలో అన్వేషించాము. అప్పుడు మేము అక్కడ ఏమి కనుగొన్నామంటే: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కార్యాన్ని తన జీవితంలో ఎన్నడూ చేయలేదు, దానిని చేయమని ఆదేశించనూ లేదు, అలాగే ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ కూడా దీనిని ఎన్నడూ చేయలేదు. దీనిని బట్టి మేము ఈ విషయం ధర్మానికి చెందినది కాదని తెలుసుకున్నాము. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన బిద్'ఆతు (నవోద్భవిత ఆచారం), మరియు యూదులు, క్రైస్తవులు తమ పండుగలలో చేసే అనుకరణలో భాగమై ఉంది.

ఈ వివరణల ద్వారా, సత్యాన్ని తెలుసుకోవాలనే స్వల్పమైన అవగాహన మరియు నిష్పక్షపాత ఆకాంక్ష కలిగిన ప్రతి ఒక్కరి కొరకు స్పష్టమవుతున్నది ఏమిటంటే మీలాదున్నబీ (ప్రవక్త జయంతి) వంటి వేడుకలు ఇస్లాం ధర్మంలో భాగం కావు. ఇవి నూతనంగా సృష్టించబడిన బిద్అత్ (నిషిద్ధ ఆచారాలు) మాత్రమే, వీటిని వదిలేయమని అల్లాహ్ సుబ్హానహు వ తాఆలా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చాలామంది చేస్తుండటం చూసి వివేకవంతులు మోసపోకూడదు. ఎందుకంటే సత్యం అనేది చేసేవారి సంఖ్య ద్వారా గుర్తించకూడదు, దానిని షరియతు ప్రమాణాల ద్వారా గుర్తించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాఆలా యూదులు మరియు క్రైస్తవుల గురించి ఇలా అన్నాడు:

﴿وَقَالُواْ لَن يَدۡخُلَ ٱلۡجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوۡ نَصَٰرَىٰۗ تِلۡكَ أَمَانِيُّهُمۡۗ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ111﴾

మరియు వారు: "యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప, మరెవ్వడూ స్వర్గంలో ప్రవేశించలేడు!" అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: "మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి! [అల్-బఖరహ్: 111] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَإِنْ تُطِعْ أَكْثَرَ مَنْ فِي الْأَرْضِ يُضِلُّوكَ عَنْ سَبِيلِ اللَّهِ...﴾

మరియు భూమిలోని అధిక సంఖ్యాకులను నీవు అనుసరిస్తే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తారు...

[అల్-అన్'ఆమ్: 116]

అలాగే ఈ పుట్టిన రోజు ఉత్సవాలు బిద్అత్ (కొత్త పోకడ) మాత్రమే కాకుండా, ఇతర చెడులను కూడా కలిగి ఉంటాయి; ఉదాహరణకు: స్త్రీ, పురుషుల మిశ్రమ సమావేశాలు, పాటలు మరియు వాయిద్యాలు వినిపించడం, మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు సేవించడం వంటి ఇతర చెడులు, దీనిలో మరింత ఘోరమైనది కూడా చోటు చేసుకోవచ్చు, అది పెద్ద షిర్క్, అంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ లేదా ఇతర వలీల వంటి వారి పట్ల అతిశయోక్తి చేయడం, వారిని వేడుకోవడం, వారిని ఆశ్రయించడం, వారిని సాయం కోరడం, వారు గూఢార్థాలను తెలుసుకుంటారని నమ్మడం, మరియు ఇలాంటి ఇతర కుఫ్ర్ పనులు, ఇవి చాలా మంది తమ ప్రవక్త మౌలిద్ వేడుకలలో మరియు ఇతర వలీలను పూజించే సందర్భాలలో చేస్తారు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఇలా పలికారని ధృవీకరించబడింది:

«إِيَّاكُم وَالغُلُوُّ فِي الدِّينِ، فَإِنَّمَا أَهْلَكَ مَن كَانَ قَبْلَكُم الغُلُوَّ فِي الدِّينِ».

మీరు ధర్మము విషయములో మితిమీరీ (అతిశయిల్లి ) ప్రవర్తించడం మానుకోండి. ఇంతకు మునుపు జాతుల వారు ధర్మము విషయములో హద్దు మీరి ప్రవర్తించడం వలన సర్వనాశనం చేయబడ్డారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«لَا تُطْرُونِي كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ، إِنَّمَا أَنَا عَبْدٌ، فَقُولُوا: عَبْدُ اللهِ وَرَسُولُه».

క్రైస్తవులు మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాంను ప్రశంసించడంలో మితిమీరినట్లుగా, మీరు నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఒక దాసుణ్ణి మాత్రమే. కనుక నన్ను ‘అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని అనండి. దీనిని బుఖారీ రహిమహుల్లాహ్ తన సహీహ్ లో ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన ఆధారంగా నమోదు చేసినారు.

విచిత్రమైన విషయం ఏమిటంటే చాలామంది జనులు ఈ బిద్అతుల ఉత్సవాలలో చురుకుగా పాల్గొంటారు, వాటిని సమర్థిస్తారు, కానీ అల్లాహ్ విధించిన జుమా మరియు ఐదు పూటల సామూహిక జమఆతు నమాజులకు హాజరు కావడంలో విఫలమవుతారు. దీనిని పెద్ద తప్పుగా భావించరు. ఇది నిస్సందేహంగా ఈమాన్ బలహీనత, అవగాహన కొరవడటం, పాపాలు మరియు దోషాల వల్ల హృదయాలపై ఏర్పడిన మాలిన్యం కారణంగా జరుగుతుంది. అల్లాహ్ మాకు మరియు మిగతా ముస్లింలకు క్షేమం, శుభం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.

కొంతమంది తమ మీలాదున్నబీ ఉత్సవాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హాజరవుతారని భావిస్తారు. అందుకే వారు ఆయనకు నిలబడి స్వాగతం పలుకుతారు. ఇది అత్యంత తప్పుడు ఆచరణ మరియు అజ్ఞానానికి పరాకాష్ట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధి నుండి ప్రళయదినం వరకు బయటకు రారు. ఆయన ఎవరితోనూ సంబంధం కలిగి ఉండరు, వారి సమావేశాలకు హాజరుకారు. ఆయన తన సమాధిలోనే ఉంటారు. ఆయన ఆత్మ పరమపదంలో తన ప్రభువు వద్ద సత్కార గృహంలో ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿ثُمَّ إِنَّكُمْ بَعْدَ ذَلِكَ لَمَيِّتُونَ15 ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ16﴾

ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.

అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు. [అల్-మోమినూన్: 15-16]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«أَنَا أَوَّلُ مَنْ يَنْشَقُّ عَنْهُ القَبْرُ يَومَ القِيَامَةِ، وَأَنَا أَوَّلُ شَافِعٍ، وَأَوًّلُ مُشَفَّعٍ».

ప్రళయదినమున మొదట నా కొరకు సమాధి బ్రద్దలవుతుంది, నేను మొట్ట మొదట సిఫారసు చేస్తాను, మొట్టమొదట నా సిఫారసు స్వీకరించబడుతుంది. ఆయనపై ఆయన ప్రభువు నుండి మహోన్నత శుభాలు, శాంతి కలుగు గాక.

ఈ రెండు పవిత్రమైన ఆయతులు, మరియు హదీథు, మరియు వాటి భావంలో ఉన్న ఇతర ఆయతులు మరియు హదీథులు: ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇతర మృతులు, నిజానికి, ప్రళయం రోజున వారి సమాధుల నుండి బయటకు వస్తారని సూచిస్తున్నాయి. ఇది ముస్లిం పండితుల మధ్య ఏకాభిప్రాయం కలిగిన విషయం; ఇందులో వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ప్రతి ముస్లిం ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు అజ్ఞానులు మరియు వారి వంటి వారు ప్రవేశపెట్టిన బిదఆతు మరియు మూఢనమ్మకాల నుండి జాగ్రత్తగా ఉండాలి; వీటికి అల్లాహ్ నుండి ఎలాంటి ఆధారం లేదు. అల్లాహ్ సహాయం చేసేవాడు, ఆయనపైనే ఆధారపడాలి మరియు ఆయన సహాయం లేకుండా మనకు ఏ శక్తీ లేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ మరియు శాంతి పంపడం: ఇది సర్వోత్తమ ఆరాధనలలో ఒకటి మరియు సత్కార్యాలలో ఒకటి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِيِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ صَلُّواْ عَلَيۡهِ وَسَلِّمُواْ تَسۡلِيمًا56﴾

నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి. [అల్-అహ్'జాబ్: 56] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً؛ صَلَّى اللهُ عَلَيهِ بِهَا عَشْرًا».

ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పంపిస్తారో అల్లాహ్ అతనిపై దాని ద్వారా పదిసార్లు శుభాలు పంపిస్తాడు. ఈ దరూద్ (ప్రార్థన) పఠనం అన్ని సమయాల్లోనూ అనుమతించబడింది, మరియు ప్రతి నమాజ్ తర్వాత పఠించడం సున్నతు (ప్రవక్త ఆచారం). మరికొంతమంది ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం, ప్రతి నమాజ్ లోని చివరి తషహ్హుద్ సమయంలో ఇది వాజిబ్ (తప్పనిసరి కర్తవ్యం)గా పరిగణించబడింది. దరూద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చదవడం అనేది అనేక ప్రత్యేక సందర్భాల్లో బలంగా సిఫార్సు చేయబడింది. ఇందులో ప్రధానమైనవి: అజాన్ తర్వాత, ప్రవక్త (స.) పేరు విన్నప్పుడు, జుమా (శుక్రవారం) రోజు మరియు రాత్రి, దీన్ని అనేక సహీహ్ హదీథులు స్పష్టంగా వివరిస్తున్నాయి.

అల్లాహ్ మాకు మరియు మిగతా ముస్లింలకు ఆయన ధర్మం గురించిన అవగాహన కలిగించమని, దానిపై నిలకడను ప్రసాదించమని మరియు అందరికి సున్నతును పాటించడంలో దయ చూపమని, బిద్అత్ నుండి జాగ్రత్తగా ఉండమని ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా ఆయన అమితంగా దాతృత్వం గలవాడు మరియు ఔదార్యుడు.

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

 

 

***

 


بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

ఆరవ సందేశము:

ఇస్రా - మేరాజ్ రాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవటం గురించిన ఆదేశము

స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, అంతిమ దైవ ప్రవక్తపై, ఆయన కుటుంబముపై, ఆయన అనుచరులపై శుభాలు, శాంతి, కరుణ కురియుగాక.

అమ్మా బఅదు: ఖచ్చితంగా, ఇస్రా (రాత్రి ప్రయాణం) మరియు మిరాజ్ (ఆకాశయానం) అనేవి అల్లాహ్ యొక్క గొప్ప నిదర్శనాలలోని నిదర్శనాలు మరియు ఇవి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యతను మరియు అల్లాహ్ సన్నిధిలో ఆయన గొప్ప స్థానాన్ని తెలియజేస్తున్నాయి, అలాగే ఇవి అల్లాహ్ యొక్క అద్భుతమైన శక్తికి మరియు సర్వ సృష్టిపై ఆయన ఆధిపత్యానికి సాక్ష్యాలుగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿سُبۡحَٰنَ ٱلَّذِيٓ أَسۡرَىٰ بِعَبۡدِهِۦ لَيۡلٗا مِّنَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ إِلَى ٱلۡمَسۡجِدِ ٱلۡأَقۡصَا ٱلَّذِي بَٰرَكۡنَا حَوۡلَهُۥ لِنُرِيَهُۥ مِنۡ ءَايَٰتِنَآۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ1﴾

తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

[అల్ ఇస్రా:1]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనేక ముతవాతిర్ హదీథులలో ఇలా తెలుపబడింది - ఆయన ఆకాశములకు ఎత్తుకెళ్లబడ్డారు, మరియు ఆయన కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి, ఆయన ఏడవ ఆకాశాన్ని దాటి వెళ్లారు, అప్పుడు పరమ పవిత్రుడైన ఆయన ప్రభువు ఆయనతో తాను కోరిన దానిని మాట్లాడినారు, మరియు ఆయనపై ఐదు పూటల నమాజులు విధిగా చేశారు, మొదట పరమ పవిత్రుడు, మహోన్నతుడై అల్లాహ్ యాభై పూటల నమాజులు విధిగా చేశారు, కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను మరలా మరలా వాటిని తగ్గించమని కోరారు, చివరికి ఆయన వాటిని ఐదుకు తగ్గించారు. కానీ విధిగావించబడింది ఐదు నమాజులే అయినా ప్రతిఫలంలో అవి యాభైగా లెక్కించబడతాయి, ఎందుకంటే ఒక మంచి పని పది రెట్లు ప్రతిఫలిస్తుంది, అల్లాహ్ యొక్క అన్ని అనుగ్రహాలకు బదులుగా ఆయనకు ఎన్నో స్తుతులు మరియు కృతజ్ఞతలు.

ఇస్రా మరియు మేరాజ్ అద్భుతం జరిగిన ఆ రాత్రి రజబ్ లేదా ఫలానా నెలలో జరిగినది అనే నిర్ధారణకు సంబంధించి సహీహ్ హదీథుల్లో ఏ ఆధారమూ లేదు. దాని నిర్ధారణకు సంబంధించి వచ్చిన ప్రతిదీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపించబడలేదు అని హదీథు పండితులు పేర్కొన్నారు. అల్లాహ్ తన పరిపూర్ణ జ్ఞానంతో దానిని ప్రజలు మరచిపోయేలా చేశాడు. అయితే అది వాస్తవంగా జరిగిందనే నిర్ధారణ ఉన్నప్పటికీ, ముస్లింలు ఆ రాత్రిని ప్రత్యేక ఆరాధనలతో జరుపుకోవడం అనుమతించబడలేదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ ఎన్నడూ దానిని అలా ప్రత్యేకంగా జరుపుకోలేదు. షబె మేరాజ్ అనే ఈ రాత్రి ఉత్సవం జరుపుకోవటం గురించి షరియతు ఆదేశం ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని గురించి తమ ఉమ్మతుకు తెలిపి ఉండే వారు - మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ. ఆనాడు ఒకవేళ అలాంటిదేదైనా జరిగి ఉంటే అది ప్రసిద్ధి చెందేది, మరియు సహాబాలు రదియల్లాహు అన్హుమ్ దానిని మనకు అందించేవారు. ఎందుకంటే వారు తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉమ్మతుకు అవసరమైన ప్రతిదీ అందించారు, మరియు ధర్మంలో ఏ విషయంలోనూ అలసత్వం ప్రదర్శించలేదు. వారు ప్రతి మంచి విషయంలో ముందడుగు వేసేవారు. ఈ రాత్రి ఉత్సవం షరియతు ఆదేశించి ఉంటే, ముందుగా వారే దానికి చేసేవారు కదా! మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుల కొరకు అత్యుత్తమమైన హితోపదేశకుడు. అల్లాహ్ సందేశాన్ని ఆయన అత్యంత చిత్తశుద్ధితో, పూర్తిగా మరియు నిజాయితీగా ప్రజలకు అందజేశారు. ఒకవేళ ఈ రాత్రిని గౌరవించడం మరియు ఘనంగా జరుపుకోవడం దైవధర్మంలో భాగమై ఉంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఖచ్చితంగా నిర్వహించేవారు మరియు దాచిపెట్టేవారు కాదు, దాని పట్ల నిర్లక్ష్యం చూపేవారు కాదు, దానిని విస్మరించేవారూ కాదు. కానీ వారి కాలంలో అలాంటిదేమీ జరగక పోవడం వలన, దీనిని ఘనంగా జరుపుకోవడం లేదా గౌరవించడం ఇస్లాం ధర్మంలో భాగం కాదని స్పష్టమవుతుంది. అల్లాహ్ ఈ ఉమ్మతు కొరకు తన ధర్మాన్ని సంపూర్ణం చేశాడు, తన అనుగ్రహాన్ని పూర్తి చేశాడు. అల్లాహ్ అనుమతించని విషయాలను ధర్మంలో ప్రవేశపెట్టేవారిని తీవ్రంగా ఖండించాడు. సుబ్హానహు వ తాలా తన సుస్పష్టమైన గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:

﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾

ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿أَمۡ لَهُمۡ شُرَكَٰٓؤُاْ شَرَعُواْ لَهُم مِّنَ ٱلدِّينِ مَا لَمۡ يَأۡذَنۢ بِهِ ٱللَّهُۚ وَلَوۡلَا كَلِمَةُ ٱلۡفَصۡلِ لَقُضِيَ بَيۡنَهُمۡۗ وَإِنَّ ٱلظَّٰلِمِينَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ21﴾

ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పుదినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది. [అష్'షూరా: 21]

మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి సహీహ్ హదీథులలో బిద్అతుల గురించి తీవ్రమైన హెచ్చరిక, అవి మార్గభ్రష్టత్వమే అనే స్పష్టీకరణ నిరూపితమై ఉన్నది; దీని ద్వారా ఉమ్మతుకు వాటి ప్రమాదం ఎంత పెద్దదో తెలియజేయబడింది, వాటిని ఆచరించకుండా వారించడం జరిగింది. దీనిలో భాగంగా సహీహైన్ లో హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని నమోదు చేయబడింది:

«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ؛ فَهُوَ رَدٌّ».

“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనలో ఉన్నది.

«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيهِ أَمْرَنَا؛ فَهُوَ رَدٌّ».

«ఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడుతుంది». సహీహ్ ముస్లింలో జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా ప్రసంగంలో ఇలా సెలవిచ్చారు:

«أَمَا بَعْدَ، فَإِنَّ خَيرَ الحَدِيثِ كِتَابُ اللهِ، وَخَيرَ الهَدْيِ هَدْيُ مُحَمَّدٍ ﷺ، وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».

అమ్మా బాద్, నిశ్చయంగా అన్నింటి కంటే మంచి మాట అల్లాహ్ గ్రంథము, మంచి మార్గదర్శకత్వము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వము, వ్యవహారాలన్నింటిలో అతి చెడ్డవి కొత్తపోకడలు, ప్రతి కొత్తపోకడ మార్గభ్రష్టత అవుతుంది. నసాయి జయ్యిద్ సనదుతో అధికం చేశారు:

«وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ».

ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారి తీస్తుంది. సునన్ గ్రంథాలలో ఇరబాద్ బిన్ సారియా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనస్సులను కదిలించే ఎంతో ప్రభావశీలమైన ఒక ఉపదేశం మాకు చేశారు. దానితో మా హృదయాలు భయంతో కంపించాయి, మా కళ్ళ వెంట కన్నీటి ధారలు ప్రవహించాయి. అప్పుడు మేము "ఓ రసూలుల్లాహ్! ఇది మీ వీడ్కోలు ఉపదేశం వలే ఉన్నది. కనుక మీరు మాకు ఏమైనా వసీయతు (ఉపదేశం) చేయండి" అని కోరాము. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఇలా ఉపదేశించినారు:

«أُوصِيكُم بِتَقْوَى اللهِ وَالسَّمعِ وَالطَّاعَةِ وَإِنْ تَأَمَّرَ عَلَيْكُم عَبْدٌ، فَإِنَّهُ مَنْ يَعِشْ مِنْكُم فَسَيَرَى اخْتِلَافًا كَثِيرًا، فَعَلَيكُم بِسُنَّتِي وَسُنَّةِ الخلُفَاءِ الرَّاشِدِينَ المَهْدِيِّينَ مِنْ بَعْدِي، تَمَسَّكُوا بِهَا وَعَضُّوا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُم وَمُحْدَثَاتِ الأُمُورِ، فَإِنَّ كُلَّ مُحْدَثَةٍ بِدْعَةٍ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».

అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండమని, ఒకవేళ మీపై ఒక బానిస అధికారిగా నియమించబడినా కూడా అతని ఆజ్ఞలు విని, అతడికి వినయవిధేయతలు చూపమని నేను మీకు హితబోధ చేస్తున్నాను. నిజానికి, మీలో ఎవరైతే (నా తర్వాత) జీవించి ఉంటారో, వారు చాలా విభేదాలు చూస్తారు. కనుక మీరు నా విధానాన్ని (సున్నతులను) మరియు నా తర్వాత సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. దానిని గట్టిగా పట్టుకుని ఉండండి, దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్, మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత. ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి.

ఇంకా, రసూలుల్లాహ్‌ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు మరియు వారి తరువాత తరాలకు చెందిన సలఫ్ సాలిహీన్ (ధర్మనిష్ఠాపరులు) బిద్‘అహ్‌ (ఆవిష్కృత ఆచారాల) గురించి హెచ్చరించేవారు మరియు వాటి గురించి (ప్రజలను) తీవ్రంగా భయపెట్టేవారు; ఎందుకంటే బిద్‘అహ్‌ అనేది ఇస్లాం ధర్మంలో అనధికారితంగా చేర్చబడే ఒక కొత్త వ్యవస్థ, అల్లాహ్ అనుమతించని విధానం, ఇది (మార్గభ్రష్టులైన) యూదులు మరియు క్రైస్తవుల వంటి అల్లాహ్ శత్రువులు వారి ధర్మంలో అదనపు విషయాలు మరియు అల్లాహ్ అనుమతించని విధానాలను ప్రవేశపెట్టడాన్ని పోలి ఉంటుంది, ఇంకా ఇది ఇస్లామీయ ధర్మం అసంపూర్ణమైనది అనే భావాన్ని మరియు దాని పరిపూర్ణతపై సందేహాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉన్న ఘోరమైన అవినీతి మరియు అనర్థం, భయంకరమైన దోషము, మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కుకు విరుద్ధంగా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసినదే.

﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ...﴾

ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసాను... [అల్ మాయిదా: 3] మరియు ఇది చాలా స్పష్టంగా బిద్అతుల నుండి దూరంగా ఉండమని హెచ్చరించే మరియు వాటిని తిరస్కరించమని ఆదేశించే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథులకు విరుద్ధంగా ఉంటుంది.

ఇంతటితో, మేము పేర్కొన్నఆదారాలలో హక్కును కోరుకునే వారికి సరిపడినంత స్పష్టత మరియు నమ్మకం ఉంటుందని ఆశిస్తున్నాము — నా ఉద్దేశం: ఇస్రా మరియు మీరాజ్ రాత్రి ఉత్సవాన్ని జరపడం అనే కొత్తచోదనాపూర్వక ఆచారాన్ని ఖండిచాలి, మరియు దానిని నిషేధించాలి. ఇది ఇస్లాం ధర్మానికి చెందిందే కాదు.

ముస్లింలు పరస్పరం హితోపదేశం చేయమనే, అల్లాహ్ విధించిన ధార్మిక విధులను వివరించమనే మరియు జ్ఞానాన్ని దాచిపెట్టకూడదనే అల్లాహ్ ఆదేశం కారణంగా, నేను నా ముస్లిం సోదరులను ఈ బిద్అత్ (కొత్త ఆచారం) గురించి హెచ్చరించాలని భావించాను. ఈ ఆచారం అనేక ప్రాంతాలలో విస్తరించింది, కొంతమంది ప్రజలు (అజ్ఞానం కారణంగా) దీనిని ఇస్లాం ధర్మంలో ఒక భాగమని భ్రమిస్తున్నారు.

ముస్లిములందరి పరిస్థితులను సంస్కరించమని, వారికి సరైన ధర్మావగాహన ప్రసాదించమని మరియు సత్యమును మాత్రమే గట్టిగా పట్టుకుని దానిపైనే స్థిరంగా ఉండటంలో మరియు దానికి విరుద్ధమైన వాటిని విడిచి పెట్టడంలో మాకూ, వారికీ తోడ్పడాలని మేము అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా, ఆయనే దానికి యజమాని మరియు సామర్థ్యం కలవాడు.

అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని, ఆశీర్వాదాలను కురిపించుగాక!

***

بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

ఏడవ సందేశము:

షాబాన్ నెల 15వ రాత్రిని ఉత్సవంగా జరుపుకోవడంపై ధార్మిక ఆదేశము

స్తుతులన్ని ఎవరు మన కొరకు ధర్మాన్ని సంపూర్ణం చేసారో, మనపై కృపను పూర్తిచేసారో ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి. మరియు తపస్సు మరియు కరుణ యొక్క ప్రవక్త అయిన ఆయన ప్రవక్త మరియు దూత ముహమ్మద్ పై శుభాలు, శాంతి కురియుగాక.

సకల ప్రశంసలు ఎవరు మన కొరకు (ఇస్లాం) ధర్మాన్ని పూర్తి చేశారో మరియు మనపై తన అనుగ్రహాన్ని పూర్తి చేశారో ఆ అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఆయన ప్రవక్త మరియు సందేశహరుడు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎవరు మన తప్పుల్ని మన్నిస్తారో మరియు ఎవరు మనపై దయ చూపుతారో ఆ అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి కురుయుగాక!

అమ్మా బాద్ : మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾

ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿أَمۡ لَهُمۡ شُرَكَٰٓؤُاْ شَرَعُواْ لَهُم مِّنَ ٱلدِّينِ مَا لَمۡ يَأۡذَنۢ بِهِ ٱللَّهُ...﴾

ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? [అష్'షూరా: 21] సహీహైనులలో ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ؛ فَهُوَ رَدٌّ».

“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. సహీహ్ ముస్లింలో జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: జుమఅహ్ ఖుత్బాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చేవారు:

«أَمَّا بَعْدُ: فَإِنَّ خَيرَ الحَدِيثِ كِتَابُ اللهِ، وَخَيرَ الهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ، وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».

అమ్మా బాద్, నిశ్చయంగా అన్నింటి కంటే మంచి మాట అల్లాహ్ గ్రంధము, మంచి మార్గదర్శకత్వము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వము, అన్ని వ్యవహారాలలో చెడ్డవి కొత్త ఆచారాలు, ప్రతి కొత్త ఆచారం మార్గభ్రష్టత అవుతుంది. ఇటువంటి అనేక ఆయతులు మరియు హదీథులు ఉన్నాయి - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ సమాజం కొరకు వారి ధర్మాన్ని (ఇస్లాం ధర్మాన్ని) పరిపూర్ణం చేశాడని మరియు వారిపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం చేశాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్పష్టమైన సందేశాన్ని పూర్తిగా అందజేసిన తరువాతనే ఆయన జీవితాన్ని ముగింపజేశాడని, అల్లాహ్ ఈ సమాజం కొరకు నియమించిన మొత్తం బోధనలు మరియు ఆచరణలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వివరించారని అవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలియజేశారు - "తన తరువాత ప్రజలు ఇస్లాం ధర్మానికి చెందినదిగా పేర్కొంటూ ప్రవేశపెట్టే ప్రతీ కొత్త మాట లేదా ఆచరణ బిద్’అత్ గా పరిగణించబడుతుంది మరియు దానిని ప్రవేశపెట్టిన వారి వైపు త్రిప్పి కొట్టబడుతుంది, వారి ఉద్దేశ్యం మంచిదైనా సరే." ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు బాగా అర్థం చేసుకున్నారు, అలాగే వారి తరువాత ఇస్లాం పండితులు కూడా. వారు బిద్’అతులను తిరస్కరించి, వాటి నుండి హెచ్చరించారు. సున్నత్ యొక్క గొప్పతనాన్ని మరియు బిద్’అతుల నిరాకరణను వివరించిన ఇబ్నె వదాహ్, తర్తూషీ, అబూ షామా మొదలైన వారి ప్రతీ రచనలో ఈ విషయం స్పష్టంగా ప్రస్తావించబడింది.

అలా కొంతమంది ప్రజలు ప్రవేశపెట్టిన బిద్అతులలో ఒకటి: షాబాన్ నెల 15వ రాత్రి ఉత్సవం జరుపుకోవటం మరియు ఆ రోజు ఉపవాసం పాటించటం. దీని గురించి ధృవీకరించే ఎలాంటి ప్రామాణిక ఆధారమూ లేదు. దీని ప్రాధాన్యత గురించి కొన్ని బలహీనమైన హదీథులు ఉన్నాయి, కానీ అవి ప్రామాణికమైనవి కాకపోవడం వలన వాటిపై ఆధారపడటం అనుమతించబడలేదు.

వాటిలో ఆ రోజు చేయమనే ప్రత్యేక నమాజు యొక్క విశిష్టత గురించి పేర్కొనబడింది; అయితే అదంతా కల్పితం మాత్రమే, దీని గురించి చాలా మంది పండితులు హెచ్చరించారు. ఇన్ షా అల్లాహ్, వారి కొన్ని మాటలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.

వాటిలో షామ్ ప్రాంతానికి చెందిన కొంతమంది తొలి కాలపు సజ్జనులు (రహ్మతుల్లా అలైహిమ్) మరియు ఇతరుల నుండి వచ్చిన కొన్ని ప్రామాణిక ఆధారాలు ఉన్నాయి.

అధిక శాతం పండితుల ఏకగ్రీవంగా అంగీకరించిన విషయం ఏమిటంటే — ఈ రాత్రిని ఉత్సవంగా జరుపుకోవడం ఒక బిదత్ (కొత్తగా ప్రవేశపెట్టిన ఆచారం) అని, దాని ఘనత గురించి వచ్చిన హదీథులన్నీ బలహీనమైనవే అని, వాటిలో కొన్ని ఖచ్చితంగా కల్పితమైనవే అని. ఈ విషయంలో హాఫిజ్ ఇబ్ను రజబ్ తన లతాయిఫుల్ మఆరిఫ్ అనే పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారు. బలహీనమైన హదీసులు వాటి మూలము సరైన ఆధారాలతో నిరూపించబడి ఉన్న ఆరాధనలలో మాత్రమే ఆచరించబడతాయని తెలుసు. షాబాన్ నెల 15వ రాత్రి ఉత్సవం జరుపుకోవటం గురించి చెప్పాలంటే, దీనికి సరైన ఆధారం ఏదీ లేదు. కేవలం బలహీనమైన హదీథులను ఆధారంగా తీసుకోవటం సరైనది కాదు. ఈ గొప్ప నియమాన్ని ఇమామ్ అబూ అబ్బాస్ షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు.

ఓ పాఠకుడా! ఈ విషయంపై కొందరు జ్ఞానవంతులు చెప్పిన మాటలను నేను నీకు అందజేస్తున్నాను, తద్వారా నీవు ఈ విషయంలో స్పష్టత పొందగలవు.

పండితులందరి (రహిమహుల్లాహ్) ఏకగ్రీవ అభిప్రాయం - ప్రజల మధ్య వచ్చే వివాదాస్పదమైన విషయాలను అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్) మరియు రసూలుల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నతుల వెలుగులో పరిష్కరించుకోవాలి. దానికి సంబంధించిన ఆదేశము ఆ రెండింటిలో వచ్చినా, లేదా వాటిలో ఏదో ఒక్క దానిలో వచ్చినా, అదే అనుసరించదగిన షరియత్ (ఇస్లామీయ చట్టం) ఆదేశము. వాటికి విరుద్ధమైనది ఏది ఉన్నా దానిని వదిలేయ వలసినదే. వాటిలో (ఖుర్ఆన్ & సున్నతులో) లేని ఏదైనా ఇబాదత్ (ఆరాధనా విధానం) అయితే అది బిద్అత్ (నిషిద్ధమైన కొత్త ఆచారం) అవుతుంది - దాన్ని చేయడం మాత్రమే కాకుండా దాన్ని ప్రోత్సహించడం కూడా అనుమతించబడలేదు. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాఆలా ఇలా సెలవిచ్చాడు:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡۖ فَإِن تَنَٰزَعۡتُمۡ فِي شَيۡءٖ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلًا59﴾

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది. [నిసా: 59] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَمَا ٱخۡتَلَفۡتُمۡ فِيهِ مِن شَيۡءٖ فَحُكۡمُهُۥٓ إِلَى ٱللَّهِ...﴾

మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది... [అష్'షూరా: 10] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡ...﴾

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు... [ఆలి ఇమ్రాన్: 31] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُواْ فِيٓ أَنفُسِهِمۡ حَرَجٗا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُواْ تَسۡلِيمٗا65﴾

అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు! [అన్'నిసా: 65] ఈ అర్ధంలో అనేక ఆయతులు ఉన్నాయి, మరియు అవి విభేదాల విషయాలను ఖుర్ఆన్ మరియు సున్నతుల వైపునకు మరలించడం తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంటున్నాయి. వాటి తీర్పును మనసారా శిరసావహించడం తప్పనిసరి, మరియు అది విశ్వాసం యొక్క మౌలికాంశము, మరియు భవిష్యత్తులో మరియు ప్రస్తుతంలో ఉన్న బంధాల కొరకు మంచి విషయం, మరియు ఉత్తమమైన ఫలితాన్నే అంటే మంచి పరిణామాన్నే ఇస్తుంది:

హాఫిజ్ ఇబ్నె రజబ్ రహిమహుల్లాహ్ తన పుస్తకంలో (లతాఇఫుల్ మఆరిఫ్) ఈ విషయము గురించి - ముందుగా చెప్పిన మాటలతో పాటు - ఇలా పేర్కొన్నారు:

షాబాన్ నెల 15వ రాత్రి గురించి షామ్ ప్రాంతానికి చెందిన తాబియీన్; ఖాలిద్ బిన్ మఅదాన్, మఖూల్, లుక్మాన్ బిన్ ఆమిర్ మరియు ఇతరులు, దీనిని గొప్పగా భావించేవారు, ఆ రాత్రిలో ఆరాధనలో శ్రమించేవారు. వారి నుండి ప్రజలు దీని ఘనత మరియు ప్రాముఖ్యతను గ్రహించారు. మరియు ఇది కూడా చెప్పబడింది: వారి వద్దకు ఈ విషయం గురించి కొన్ని ఇస్రాయీలీ (యూదుల) కథనాలు చేరాయి. ఈ విషయం పలుదేశాలలో వ్యాపిస్తున్నప్పుడు, ప్రజలు దీనిపై స్పందించ సాగినారు. వారిలో కొందరు దాన్ని అంగీకరించారు మరియు ఆ రాత్రిని గౌరవించడంపై వారికి అనుకూలంగా ఉన్నారు - అలాంటి వారిలో బస్రా నగరానికి చెందిన కొంతమంది భక్తుల సమూహం మరియు ఇతరులు ఉన్నారు. మరియు హిజాజ్ ప్రాంతంలోని ఎక్కువ మంది పండితులు దీనిని తిరస్కరించారు. వీరిలో అతా, ఇబ్నె అబీ ములైకా కూడా ఉన్నారు. మరియు "ఇదంతా బిద్అత్" అనే అభిప్రాయాన్ని, అబ్దుర్రహ్మాన్ బిన్ జైద్ బిన్ అస్లమ్ మదీనా పండితుల నుండి పొందారు. ఇది ఇమామ్ మాలిక్ మరియు ఇతరుల శిష్యుల అభిప్రాయం కూడా.

షామ్ ప్రాంతంలోని పండితులు దాని పునరుద్ధరణ లక్షణాలపై రెండు అభిప్రాయాలు వ్యక్తం చేశారు:

మొదటిది: మస్జిదుల్లో సామూహికంగా ఈ రాత్రిని జరుపుకోవడం ముస్తహబ్. ఖాలిద్ బిన్ మదాన్, లుక్మాన్ బిన్ ఆమిర్ మరియు ఇతరులు ఈ రాత్రిలో తమ ఉత్తమ వస్త్రాలు ధరించి, సాంబ్రాణి ధూపం వేసుకుని, కజ్జలాన్ని పెట్టుకుని, ఆ రాత్రి మస్జిదులో గడిపేవారు. ఇస్హాఖ్ బిన్ రహ్వే కూడా దీనికి సమ్మతించారు. మస్జిదులలో జమాతుతో తరావీహ్ నమాజ్ ఆచరించడం బిద్అత్ కాదు అని హరబ్ అల్ కర్మాని తన ప్రశ్నలలో పేర్కొన్నారు.

రెండవది: మస్జిదులలో నమాజులు, గాథలు మరియు దుఆల కొరకు ప్రజలు జమ అవ్వడం మక్రూహ్ (అనుచితం) అని, అయితే ఒక వ్యక్తి తాను ఒంటరిగా చేసే సున్నతు నమాజులు కూడా మస్జిదులోనే చేయడం అనుచితం కాదు అని, ఇది అల్’అవ్జాఈ (రహిమహుల్లాహ్) షామ్ ప్రజల ఇమామ్ మరియు ధర్మ పండితుడు మరియు జ్ఞాని యొక్క అభిప్రాయం, మరియు ఈ అభిప్రాయాన్ని అల్లాహ్ తాలా ఇష్టపడితే, అది సత్యానికి దగ్గరగా ఉంటుంది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ మాటలలో: 'షాబాన్ నెల 15వ రాత్రి గురించి ఇమాం అహ్మద్ నుండి ఏమీ పేర్కొనబడలేదు. అయితే, ఈ రాత్రి జాగారం చేయడం గురించి ఆయన నుండి రెండు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి - ఆ రెండు అభిప్రాయాలు - ఇవి పండుగ రాత్రుల జాగారం గురించి ఉన్న రెండు అభిప్రాయాల నుండి ఉద్భవించాయి. (ఒక అభిప్రాయంలో) ఆయన దీనిని సమూహంగా జాగారం చేయడం సిఫార్సు చేయలేదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల నుండి ఇది ధృవీకరించబడలేదు.' ఇది (ఒక రివాయత్ లో) అభిలాషణీయంగా పరిగణించబడింది, ఎందుకంటే అబ్దుర్ రహ్మాన్ బిన్ యజీద్ బిన్ అస్వద్ ఈ విధంగా చేశారు, మరియు ఆయన తాబయీన్ లో ఒకరు. అలాగే షాబాన్ నెల 15వ రాత్రి జాగారం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి లేదా ఆయన సహచరుల నుండి ఏ ఆధారం లేదు. కానీ షామ్ ప్రాంతంలోని ప్రముఖ ఫుఖహా తాబయీన్ నుండి ఇది నమోదు చేయబడింది.

హాఫిజ్ ఇబ్న్ రజబ్ రహిమహుల్లాహ్ మాటల ప్రస్తావన ఇక్కడ ముగిసింది, మరియు ఇందులో ఆయన స్పష్టంగా ఇలా పేర్కొన్నారు: షాబాన్ నెల 15వ రాత్రి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి లేదా ఆయన సహచరులు రదియల్లాహు అన్హుమ్ ల నుండి ఏ ప్రామాణిక ఆధారమూ లేదు.

ఇమాం ఔజాయీ రహిమహుల్లాహ్ ఎంచుకున్నది ఏమిటంటే వ్యక్తిగతంగా దానిలో ఖియామ్ చేయటం ముస్తహబ్ (అభిలాషణీయం) అన్న దాని నుంచి . హాఫిజ్ ఇబ్న్ రజబ్ ఈ అభిప్రాయమును ఎంచుకున్న విషయం విచిత్రమైనది మరియు బలహీనమైనది. ఎందుకంటే ఏదైనా విషయం శాసనసంబంధమైన ప్రామాణిక ఆధారాలతో నిర్ధారించబడకపోతే, దానిని అల్లాహ్ యొక్క ధర్మంలో ప్రవేశపెట్టడం ముస్లింలకు అనుమతించబడలేదు, అది వ్యక్తిగతంగా చేసినా లేదా సమూహంగా చేసినా, దానిని రహస్యంగా చేసినా లేదా బహిరంగంగా చేసినా; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాధారణ ఉపదేశం ప్రకారం:

«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيهِ أَمْرُنَا؛ فَهُوَ رَدٌّ».

ఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడును. ఇంకా బిద్అత్ ను తిరస్కరించవలసిందిగా సూచించే మరియు వాటి గురించి హెచ్చరించే అనేక ఆధారాలు ఉన్నాయి.

ఇమామ్ అబూ బకర్ తర్తూషీ రహిమహుల్లాహ్ తన పుస్తకం ‘అల్ హవాదిస్ వల్ బిద్అ’లో ఇలా ఉల్లేఖించినారు:

ఇబ్న్ వజాహ్ జైద్ బిన్ అస్లమ్ నుండి ఉల్లేఖిస్తూ చెప్పారు: మా పండితులలో మరియు ధర్మవేత్తలలో ఎవరినీ షాబాన్ నెల 15వ తేదీకి ప్రాధాన్యత ఇవ్వడం గాని, మకహూల్ హదీథుకు ప్రాముఖ్యత ఇవ్వడం గాని చూడలేదు, మరియు దానికి ఇతర తేదీలపై ప్రత్యేకతను కూడా ఇవ్వలేదు.

ఇబ్ను అబీ ములైకా తో ఇలా చెప్పబడింది: జియాద్ అన్ నమీరీ ఇలా అంటున్నారు: షాబాన్ నెల అర్థ రాత్రి యొక్క పుణ్యం, లైలతుల్ ఖదర్ యొక్క పుణ్యంతో సమానమైనది. అప్పుడు ఆయన ఇలా పలికారు: నేను దానిని విని ఉంటే (అంటే నా ఎదురుగా ఇది చెప్పబడితే), అపుడు ఒకవేళ నా చేతిలో ఒక కర్ర ఉంటే, నేను దానితో అతడిని కొట్టేవాడిని. జియాద్ ఒక ప్రబోధకుడు (కథకుడు)గా ఉన్నాడు, అవసరమైన విషయం ఇక్కడ ముగిసింది.

ప్రముఖ పండితుడు శౌకానీ రహిమహుల్లాహ్ తన పుస్తకం **"అల్-ఫవాయిదుల్ మజ్మూఅహ్"**లో ఇలా పేర్కొన్నారు:

హదీథు: «ఓ అలీ, ఎవరైతే షాబాన్ నెల అర్థ రాత్రి వంద రకాతులు నమాజు చేస్తారో, ప్రతి రకాతులో ఫాతిహతుల్ కితాబ్ మరియు కుల్ హువల్లాహు అహద్ పదిసార్లు పఠిస్తారో, అల్లాహ్ అతని ప్రతి అవసరాన్ని తీర్చుతాడు» తదితరులు. ఇది కల్పించబడిన హదీథు, దానిని ఆచరించే వారికి లభించే పుణ్యం గురించి స్పష్టంగా చెప్పబడిన పదాలు కల్పించబడినవని గుర్తించడంలో వివేకం ఉన్నవారు ఎవరైనా సందేహించరు, మరియు దాని ఉల్లేఖకులు అపరిచితులు, ఇది రెండవ మరియు మూడవ మార్గాల ద్వారా కూడా ఉల్లేఖించబడింది, ఇవన్నీ కల్పించబడినవి మరియు వాటి ఉల్లేఖకులు అపరిచితులు. ముఖ్తసర్ లో ఆయన ఇలా పేర్కొన్నారు : షాబాన్ నెల 15వ రాత్రి ప్రార్థన గురించి పేర్కొనబడిన హదీథు బాతిల్ (ప్రామాణికమైనది కాదు). హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఇబ్న్ హిబ్బాన్ ఇలా పేర్కొన్నారు : షాబాన్ నెల 15వ రాత్రి జాగారం చేయండి, పగలును ఉపవాసం పాటించండి. జయీఫ్ (బలహీనమైన) హదీథు. ఆయన అల్'లాలీ లో ఇలా తెలిపారు: «షాబాన్ నెలలో వంద రకాతులు, (అందులో ప్రతి రకాతులో) ఇఖ్లాస్ తో పది సార్లు» దీని ఘనత చాలా ఎక్కువ, దైలమీ మరియు ఇతరులచే ఇది మౌదూ, మరియు మూడు మార్గాలలోని ఉల్లేఖకులు ఎక్కువగా తెలియని అపరిచితులు అని పేర్కొనబడింది. ఆయన తెలిపారు: «ముప్పది సార్లు ఇఖ్లాస్ తో పన్నెండు రకాతులు». ఇది కల్పితం, «పద్నాలుగు రకాతులు» కూడా కల్పితం.

ఈ హదీథు ద్వారా కొందరు ధర్మవేత్తలు మోసపోయారు; అల్ ఇహ్యా రచయిత వంటి వారు మరియు మరికొందరు తఫ్సీర్ రచయితలు కూడా. ఈ రాత్రి నమాజు - అంటే: షాబాన్ నెల మధ్య రాత్రి - వివిధ విధానాల్లో రివాయత్ చేయబడింది, ఇవన్నీ అసత్యమైనవి మరియు కల్పితమైనవి. ఇది హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా కథనం నుండి తిర్మిథీ ఉల్లేఖించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 'బఖీ' శ్మశానానికి వెళ్ళడం మరియు రాత్రి యొక్క మధ్యభాగంలో ప్రభువు భూలోక ఆకాశానికి దిగి వస్తాడు మరియు గొర్రెల (కాపలా) కుక్క జుట్టు కంటే ఎక్కువ మందిని క్షమిస్తాడు అనే విషయాన్ని వ్యతిరేకించదు, ఎందుకంటే ఈ ప్రత్యేక రాత్రిలోని ఈ నమాజు గురించి మాత్రమే మాట జరుగుతున్నది, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఈ హదీథులో బలహీనత మరియు విరామం ఉంది, అలాగే అలీ రదియల్లాహు అన్హు యొక్క రాత్రి నమాజు గురించి ఇంతకు ముందు చెప్పిన హదీథు కూడా ప్రామాణికంగా బలహీనమైనదే, అయినప్పటికీ ఈ నమాజు కల్పితమైనదని నిరూపించదు, మేము చెప్పినట్లుగా.

ఇరాఖీ హాఫిజ్ గారు ఈ విధంగా పేర్కొన్నారు: "రాత్రి మధ్యలో నమాజు గురించి ఉన్న హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కల్పించబడినదే మరియు అది ఆయనపై అబద్ధం పలకడం వంటిది. ఇమామ్ నవవీ తన పుస్తకంలో: (అల్ మజ్మూఅ్) ఇలా అన్నారు: ‘సలాతుర్’రఘాయిబ్ అని పిలవబడే నమాజు, ఇది రజబ్ నెల మొదటి జుమా రాత్రి, మగ్రిబ్ మరియు ఇషా మధ్య పన్నెండు రకాతులు, మరియు షాబాన్ నెల మధ్య రాత్రి వంద రకాతులు, ఈ రెండు నమాజులు బిద్’అత్ మరియు ముంకర్. వాటిని (కూత్ అల్ కులూబ్) మరియు (ఇహ్యా ఉలూమ్ అల్ దీన్) పుస్తకాల్లో పేర్కొనబడటం చూసి మోసపోవద్దు, మరియు వాటిలో పేర్కొన్న హదీథుకు కూడా మోసపోవద్దు, ఎందుకంటే అది అంతా అసత్యం, మరియు కొందరు ఇమాములు వాటి ఆదేశం తెలుపుతూ తప్పుడు పత్రాలతో వాటి ప్రాముఖ్యత గురించి పుస్తకాలు రాశారు, అయితే వారు ఆ విషయంలో పొరబడినవారు.’

షేఖ్ ఇమామ్: అబూ ముహమ్మద్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఇస్మాయీల్ అల్-మక్దసీ ఈ విషయంపై ఒక విలువైన పుస్తకాన్ని రచించారు, అందులో ఆయన అద్భుతంగా మరియు సమర్థవంతంగా వ్రాశారు. ఈ విషయంపై హదీథు ఉలమాల మాటలు చాలా ఉన్నాయి. ఈ విషయంపై మేము తెలుసుకున్న ప్రతీ మాటను ఇక్కడ తెలియపరచాలంటే, మాటలు చాలా పొడవుగా సాగుతాయి. మేము చెప్పిన వాటిలో సత్యాన్ని కోరుకునే వారికి తగినంత మరియు సంతృప్తికరమైనది ఉండవచ్చు.

పై పేర్కొన్న ఆయతులు, హదీథులు మరియు ఉలమాల మాటల ద్వారా: సత్యాన్ని కోరుకునే వారి కొరకు షాబాన్ నెల 15వ రాత్రిని నమాజ్ లేదా ఇతర ఆరాధనలతో జరుపుకోవటం, దాని పగలును ఉపవాసం కొరకు ప్రత్యేకించుకోవటం అనేది ఎక్కువ మంది ఉలమాల దృష్టిలో ఓ నిందనీయమైన బిద్అత్. ఇది ఎలాంటి పవిత్ర షరీఅతు ఆధారము లేని విషయం, నిజానికి ఇది సహాబాల కాలం తరువాత ఇస్లాంలో ప్రవేశించిన కొత్త పోకడ. ఈ విషయంలో మరియు ఇతర విషయాలలో సత్యాన్ని కోరుకునే వారికి అల్లాహ్ జల జలాలుహు యొక్క ఈ ఒక్క మాట సరిపోతుంది:

﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ...﴾

ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసినాను... [అల్ మాయిదా: 3] ఈ అర్థంలో వచ్చిన అనేక ఆయతులు ఉన్నాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీథు:

«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ».

“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. వాటి అర్ధంలో వచ్చిన మరికొన్ని హదీథులు.

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«لَا تَخُصُّوا لَيْلَةَ الْجُمُعَةِ بِقِيَامٍ مِنْ بَيْنِ اللَّيَالِي، وَلَا تَخُصُّوا يَوْمَهَا بِالصِّيَامِ مِنْ بَيْنِ الْأَيَّامِ، إِلَّا أَنْ يَكُونَ فِي صَوْمٍ يَصُومُهُ أَحَدُكُمْ».

మీరు ఇతర రాత్రులకు భిన్నంగా జుమా నాటి రాత్రిని (నఫిల్) నమాజుల కోసం ప్రత్యేకించుకోకండి. అలాగే ఇతర పగళ్ళకు భిన్నంగా జుమానాటి పగలును ఉపవాసం కోసం ప్రత్యేకించుకోకండి. ఒకవేళ మీలో ఎవరికయినా తన ఆనవాయితీ ప్రకారం ఆ రోజు ఉపవాసం ఉండవలసి వస్తే అది వేరే విషయం. ఏదైనా రాత్రిని ప్రత్యేక ఆరాధనల కొరకు ప్రత్యేకించుట అనుమతించబడినట్లయితే, శుక్రవారం రాత్రి ఇతర రాత్రుల కంటే ప్రథమ స్థానములో ఉండేది; ఎందుకంటే దాని దినము సూర్యుడు ఉదయించే దినములలో ఉత్తమమైన దినము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీహ్ హదీథులలో స్పష్టముగా పేర్కొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రులలో ఏదైనా ఒక రాత్రిని ప్రత్యేకించి జాగారం చేయవద్దని హెచ్చరించినప్పుడు, అది ఇతర రాత్రులకు కూడా వర్తిస్తుంది. ఏ రాత్రినైనా ఏదైనా ఆరాధన కొరకు ప్రత్యేకించుకోవటం అనేది సరైన ఆధారం లేకుండా అనుమతించబడదు.

ఘనమైన లైలతుల్ ఖద్ర్ రాత్రి మరియు రమదాను రాత్రులు నమాజు మరియు ఆరాధనలతో గడపడం శ్రేయస్కరం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై దృష్టి పెట్టారు మరియు ఉమ్మతును ఆ రాత్రులను గడపమని ప్రోత్సహించారు. ఆయన స్వయంగా కూడా అలా చేశారు. బుఖారీ మరియు ముస్లింలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు ఇలా నమోదు చేయబడింది:

«مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ، وَمَنْ قَامَ لَيْلَةَ الْقَدْرِ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ».

«ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెలలో నమాజు ఆచరిస్తూ గడుపుతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ రాత్రి నమాజులలో నిలబడతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.» షాబాన్ నెల 15వ రాత్రి, లేదా రజబ్ నెల మొదటి శుక్రవారం రాత్రి, లేదా ఇస్రా - మేరాజ్ రాత్రి, ప్రత్యేకంగా ఉత్సవం లేదా ఏదైనా ఆరాధన కొరకు ప్రత్యేకించబడినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతుకు దానిని సూచించేవారు, లేదా తానే స్వయంగా చేసేవారు. అలాంటిదేదైనా జరిగి ఉంటే, సహాబాలు రదియల్లాహు అన్హుమ్ దానిని ఉమ్మతుకు తెలియజేసేవారు, దానిని దాచిపెట్టేవారు కాదు. వారు ప్రవక్తల తరువాత ఉత్తములు, మరియు అత్యంత నిష్కపటులు. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాల రదియల్లాహు అన్హుమ్ పట్ల సంతృప్తి చెందినాడు.

మీరు ఇంతకు ముందు ఉలమాల మాటల నుండి తెలుసుకున్నట్లుగా, రజబ్ నెల మొదటి జుమా రాత్రి మరియు షాబాన్ నెల 15వ రాత్రి విశిష్టత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి గానీ, ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ నుండి గానీ ఏ ఆధారమూ లేదు. కాబట్టి, ఈ రెండు రాత్రులను పురస్కరించుకుని ఉత్సవం జరుపుకోవటం ఇస్లాంలో ఓ కొత్త పోకడ. అలాగే, ఈ రాత్రులను ఏదైనా ప్రత్యేక ఆరాధన కొరకు ప్రత్యేకించుకోవటం కూడా ఓ అసహ్యకరమైన బిద్అతు. ఇదే విధంగా, రజబ్ మాసంలో 27వ రాత్రిని కొంతమంది ఇస్రా మరియు మీరాజ్ రాత్రిగా నమ్ముతూ ఉంటారు. అయితే, ఆ రాత్రిని ప్రత్యేక ఆరాధనలతో కేటాయించడం అనుమతించబడదు, అలాగే దానిని ఉత్సవంగా జరుపుకోవడం కూడానీ కాదు — మునుపు వచ్చిన దృఢమైన ఆధారాల ప్రకారం. ఇది ఆ రాత్రి ఖచ్చితంగా తెలుసు అనుకుంటే కూడా అనుమతించబడదు, మరి అది ఖచ్చితంగా తెలియదని ధార్మిక పండితులు స్పష్టంగా చెప్పిన దృష్టిలో చూస్తే పరిస్థితి ఎంత స్పష్టమైందో అర్థం చేసుకోవచ్చు. రజబ్ నెల 27వ రాత్రే లైలతుల్ ఖద్ర్ రాత్రి అని చెప్పేవారి మాట అసత్యం, దీనికి సహీహ్ హదీథుల నుండి ఎలాంటి ఆధారం లేదు. ఎవరు ఇలా క్రింద పేర్కొన్నట్లుగా చెప్పారో, వారు చాలా బాగా చెప్పారు:

మంచి విషయాలు మార్గదర్శకత్వంలో ముందుకు సాగేవి ... చెడ్డ విషయాలు ధర్మంలో కొత్తపోకడల బిద్అత్.

అల్లాహ్ మమ్మల్ని మరియు మిగతా ముస్లింలను సున్నతులను పట్టుకోవడంలో మరియు దానిపై స్థిరంగా ఉండడంలో సాఫల్యం చేకూర్చమని మరియు దానికి విరుద్ధమైన వాటి నుండి జాగ్రత్త పడే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా ఆయన అమితంగా దాతృత్వం గలవాడు మరియు ఔదార్యుడు.

 

అల్లాహ్ తన దాసుడు మరియు తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక!

بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

ఎనిమిదవ సందేశము:

తప్పుడు వీలునామా (వసీయత్) గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక

షేక్ అహ్మద్, ఖాదిమ్ అల్ హరమ్ అల్ నబవీ అష్ షరీఫ్

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ సందేశం:

దీనిని చదివే ముస్లింలందరినీ, అల్లాహ్ ఇస్లాం ద్వారా రక్షించుగాక. అజ్ఞానుల మరియు హద్దు మీరిన వారి అబద్ధాల నుండి మమ్మల్ని మరియు మిమ్మల్ని కాపాడుగాక. ఆమీన్.

సలామున్ అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు (మీపై అల్లాహ్ శాంతి,కారుణ్యము,శుభాలు కురియుగాక).

అమ్మా బఅదు: నేను మదీనా మునవ్వరా నుండి షేఖ్ అహ్మద్ ఖాదిమ్ అల్-హరమ్ అన్-నబవీ అల్-షరీఫ్ వ్రాసిన ఈ సందేశాన్ని పరిశీలించాను, దాని శీర్షిక: «మదీనా మునవ్వరా షేఖ్ అహ్మద్, ఖాదిమ్ అల్-హరమ్ అన్-నబవీ అల్-షరీఫ్ నుండి ఒక సిఫార్సు», అందులో ఆయన ఇలా అన్నారు:

ఒక శుక్రవారం రాత్రి నేను మేల్కొని ఉండి పవిత్ర ఖుర్ఆన్ పఠించాను, ఆపై అల్లాహ్ యొక్క సుందర నామాలను పఠించాను. ఆ పఠనం ముగిసిన తర్వాత నిద్రకు సిద్ధమయ్యాను. అప్పుడు నేను విశ్వానికి కరుణామూర్తి, అల్లాహ్ యొక్క సృష్టిలో అత్యంత గౌరవనీయులైన మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలలో చూశాను. ఆయన నన్ను 'ఓ షేఖ్ అహ్మద్' అని పిలిచినారు: నేను సమాధానమిస్తూ: 'లబ్బైక్, యా రసూలుల్లాహ్! యా అక్రమ ఖలఖల్లాహ్ (అల్లాహ్ సృష్టిలో అత్యంత గౌరవనీయులారా!)' అని అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు: ప్రజల చెడు పనుల వల్ల నేను సిగ్గుపడుతున్నాను, మరియు నా ప్రభువును లేదా దైవదూతలను ఎదుర్కోలేకపోతున్నాను; ఎందుకంటే ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు నూట అరవై వేల మంది ఇస్లాం ధర్మం స్వీకరించకుండానే మరణించారు - ఆ పై ప్రజలు చేసిన పాపాలను కొంత వివరించారు, తరువాత ఆయన ఇలా అన్నారు: ఈ వసియతు ఉపదేశం, సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి అయిన అల్లాహ్ వైపు నుండి వారి కొరకు ఒక కారుణ్యము. తరువాత కొన్ని ప్రళయ సూచనలను ప్రస్తావించి, ఇంకా ఇలా అన్నారు: "ఓ షేఖ్ అహ్మద్, ఈ వీలునామాను వారికి తెలియజేయండి; ఇది లౌహే మహ్ఫూద్ నుండి విధి కలంతో రాయబడింది. దీన్ని వ్రాసి ఒక ఊరు నుండి మరొక ఊరికి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపిన వారికి స్వర్గంలో ఒక కోట నిర్మించబడుతుంది. దీన్ని వ్రాయని మరియు పంపని వారికి రేపు పరలోకదినాన నా సిఫారసు నిషిద్ధం. దాన్ని వ్రాసిన వాడు ఒకవేళ పేదవాడైతే, అల్లాహ్ అతనికి సంపదను ప్రసాదిస్తాడు, లేదా అతడు అప్పులలో ఉన్నవాడైతే, అల్లాహ్ అతని అప్పులను తీర్చుతాడు, లేదా అతను పాపం చేసి ఉంటే, ఈ సిఫారసు యొక్క పవిత్రతతో అల్లాహ్ అతనిని మరియు అతని తల్లిదండ్రులను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ యొక్క ఆరాధకులలో ఎవరు దానిని వ్రాయకపోతే, వారి ముఖం ఈ లోకంలో మరియు పరలోకంలో నలుపుగా మారుతుంది, ఇంకా ఇలా పలికెను: "వల్లాహిల్ అజీమ్ (మహోన్నతుడైన అల్లాహ్ సాక్షిగా మూడు సార్లు – ఇది నిజం. నేను అబద్ధం చెప్పుంటే, ఇస్లాం మతం లేకుండానే ఈ లోకాన్ని విడిచి పోవాలని అల్లాహ్‌తో ప్రమాణం. ఎవడు దీనిని నమ్మితే, నరకం శిక్ష నుండి రక్షించబడతాడు. ఎవడు దీనిని అంగీకరించకపోతే, అతను కాఫిర్ అవుతాడు."

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కల్పించిన వీలునామా యొక్క సారాంశం. ఈ కల్పిత వీలునామాను మేము అనేక సంవత్సరాలుగా అనేక సార్లు విన్నాము. ఇది ప్రజల మధ్య కాలానుగుణంగా ప్రచారం చేయబడుతుంది, మరియు అనేక మంది సాధారణ ప్రజలలో బాగా వ్యాపించింది, దీనిలో ఉపయోగించిన పదాలు ఒక్కోసారి మారుతూ ఉంటాయి. ఈ అబద్ధపు వీలునామ (వసీయత్)ను కల్పించినవాడు ఇలా చెప్పాడు: అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను స్వప్నంలో చూశాడు, మరియు ఈ చివరి ప్రకటనలో, పాఠకుడా! అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు చూశానని చెప్పాడు, దీని అర్థం: అతను ప్రవక్తను ప్రత్యేక్షంగా చూశాడు

ఈ అబద్ధాలను కల్పించిన వ్యక్తి ఈ వసియత్తులో (వీలునామాలో) అనేక విషయాలు చెప్పాడు - అవి స్పష్టమైన అబద్ధాలు మరియు తేటతెల్లని అసత్యాలు. అల్లాహ్ అనుమతిస్తే, నేను ఈ వ్యాసంలో వాటి గురించి త్వరలోనే మీకు హెచ్చరికలు చేస్తాను. గత కొన్ని సంవత్సరాలలోనే ఈ వసీయత్‌లోని అబద్ధాలపై నేను ప్రజలను అప్రమత్తం చేశాను మరియు ఇది పూర్తిగా అబద్ధమైనదని, అసత్యమైనదని వారికి వివరిస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ వసీయత్ యొక్క తాజా సంచిక నా దృష్టికి వచ్చినప్పుడు, దాని అబద్ధం ఎంత స్పష్టమో, దానిని తయారుచేసినవాడు ఎంత ధైర్యంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడో చూసి, దానిపై మళ్లీ రాయాలా వద్దా అనే విషయంలో తడబడ్డాను. ఎందుకంటే దాని అబద్ధత స్పష్టంగా ఉండటంతోపాటు, ఎంతైనా కూడా కొంత సరళమైన బుద్ధి గలవారికి కూడా ఇది నమ్మదగినదిగా అనిపించదనుకున్నాను. అయితే, అది చాలా మంది ప్రజలలో వ్యాపించిందని, వారు దానిని తమలో తాము పంచుకుంటున్నారని, మరియు కొందరు దానిని విశ్వసించారని అనేక మిత్రులు నాకు తెలియజేశారు; ఈ కారణంగా, దాని అసత్యతను స్పష్టం చేయడానికి, మరియు అది ప్రవక్త ﷺ పై కల్పించబడిన అబద్ధమని తెలియజేయడానికి, తద్వారా ఎవరూ దాని ద్వారా మోసపోకుండా ఉండటానికి, నాలాంటి వారు దాని గురించి వ్రాయడం తప్పనిసరి అని నేను భావించాను. దానిని సరైన జ్ఞానం మరియు విశ్వాసం కలిగినవారు, లేదా సహజసిద్ధమైన స్వభావం మరియు సరిగ్గా ఆలోచించే బుద్ధి కలిగినవారు జాగ్రత్తగా పరిశీలిస్తే, అనేక కోణాల నుండి అది అబద్ధం మరియు కల్పితమని గ్రహిస్తారు.

మరియు నేను షేఖ్ అహ్మద్ సన్నిహితులలో కొందరిని ఈ వీలునామ గురించి అడిగాను, దానికి వారు నాకు ఇలా సమాధానమిచ్చారు: ఇది షేఖ్ అహ్మద్ పై అబద్దంగా రుద్దబడినది, నిజానికి ఆయన అసలు అలా చెప్పనే లేదు, మరియు పైన పేర్కొన్న షేఖ్ అహ్మద్ కొంతకాలం క్రితమే మరణించారు. ఒకవేళ పైన పేర్కొన్న షేఖ్ అహ్మద్ లేదా అతని కంటే పెద్దవాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను స్వప్నంలో లేదా ప్రత్యేక్షంగా చూశానని, మరియు ఈ సిఫారసును ఇచ్చారని నిజంగా చెప్పి ఉంటే, దానిని మేము ఖచ్చితంగా ఇలా అర్థం చేసుకుంటాము "అతను అబద్ధం చెబుతున్నాడు, లేదా అతనికి చెప్పినది షైతాను, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాదు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి." వాటిలో కొన్ని:

మొదటిది: అల్లాహ్‌ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాంతరం ఆయనను యధార్థంగా జాగృతంలో చూడలేరు. ఎవడయితే జ్ఞానరహితమైన కొంతమంది తత్వశాస్త్రులు (సూఫీలు) తమకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జాగృతంలో కనిపించారని, లేదా మౌలిద్‌ (పుట్టిన రోజు సభ) కు హాజరై ఉంటారని చెబుతారో, వారు బహు పెద్ద పొరపాటు చేశారు. వారు సత్యాన్ని అస్పష్టంగా చేసి, తీవ్రమైన తప్పులో పడ్డారు. ఇది ఖుర్ఆన్‌, సున్నత్‌, అలాగే అహ్లె ఇల్మ్ ఏకాభిప్రాయానికి విరుద్ధమైన విషయమూ కావున, ఇది అంగీకారయోగ్యం కాదు. ఎందుకంటే మృతులు తమ సమాదుల నుండి ప్రళయ దినం వచ్చినపుడే బయటికొస్తారు, ఈ లోకంలో కాదు. దీనికి విరుద్ధంగా చెప్పేవాడు స్పష్టమైన అబద్ధం చెబుతున్నాడు, లేదా తప్పుడు మార్గంలో ఉన్నాడు. అంతేగాక అతడు సలఫ్ సాలిహ్ తెలుసుకున్న సత్యం గురించి ఎరుగని వాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు మరియు వారి అనుచరులు అనుసరించిన మార్గం గురించి తెలియని వాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿ثُمَّ إِنَّكُم بَعۡدَ ذَٰلِكَ لَمَيِّتُونَ15 ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ16﴾

ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.

అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు. [అల్ ముమినూన్: 15-16] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«أَنَا أَوَّلُ مَنْ تَنْشَقُّ عَنْهُ الْأَرْضُ يَوْمَ الْقِيَامَةِ، وَأَنَا أَوَّلُ شَافِعٍ وَأَوَّلُ مُشَفَّعٍ».

నేనే పునరుత్థాన దినమున భూమి నుండి మొదట బయటకు వచ్చే వ్యక్తిని, నేనే మొట్ట మొదటి సిఫారసుదారుడిని, మొట్టమొదట నా సిఫారసు స్వీకరించబడుతుంది. ఈ అర్ధంలో ఆయతులు మరియు హదీథులు చాలా ఉన్నాయి.

రెండవది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను జీవించి ఉన్నప్పుడే కాక మరణించిన తరువాత కూడా సత్యానికి విరుద్ధమైనదేమీ చెప్పరు. అయితే ఈ వాసీయతు (ఉపదేశం) ఆయన షరీఅతుకు స్పష్టంగా వ్యతిరేకంగా ఉంది — అనేక కోణాల్లో ఇది స్పష్టమవుతుంది (ఇవి తరువాత వివరించబడతాయి). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రలో కనిపించవచ్చు. స్వప్నంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర రూపాన్ని చూసినవాడు నిజంగానే ఆయనను చూశాడు; ఎందుకంటే షైతాను ఆయన రూపాన్ని ధరించలేడు, ఇది సహీహ్ హదీథులో స్పష్టంగా ఉంది. కానీ అసలు విషయం - ఆ వ్యక్తి యొక్క విశ్వాసం, నిజాయితీ, న్యాయం, నియంత్రణ, ధార్మికత మరియు విశ్వసనీయత. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిజమైన రూపంలో ఆయనను చూశాడా లేదా వేరే రూపంలో చూశాడా.

ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితకాలంలో పలికిన హదీథు నమ్మకస్తులైన మరియు న్యాయమైన వ్యక్తుల ద్వారా ఉల్లేఖించబడకపోతే, దానిపై ఆధారపడకూడదు మరియు దానిని ఆధారంగా తీసుకోకూడదు. లేదా అది నమ్మకస్తులైన మరియు న్యాయమైన వ్యక్తుల ద్వారా వచ్చినా కానీ అది మరింత జ్ఞాపకశక్తి గల మరియు విశ్వసనీయమైన వ్యక్తుల రివాయత్‌కు విరుద్ధంగా ఉంటే, మరియు ఆ రెండు రివాయతులను కలపడం సాధ్యం కాకపోతే, అందులో ఒకటి రద్దు చేయబడినదిగా పరిగణించబడుతుంది మరియు దానిని అనుసరించకూడదు. రెండవది: రద్దు చేయబడని దానినే అనుసరించాలి, సాధ్యమైతే దాని షరతులతో సహా. ఒకవేళ కలపడం లేదా రద్దు చేయడం సాధ్యం కాకపోతే, తక్కువ జ్ఞాపకశక్తి గల మరియు తక్కువ న్యాయమైన వ్యక్తుల రివాయత్‌ను విస్మరించాలి మరియు దానిని అనుసరించకూడదు, మరియు దానిని షాజ్ గా (విచిత్రమైనదిగా) పరిగణించాలి.

మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ నుండి వచ్చిన వసీయత్ (వీలునామా) అని చెప్పబడినదాని యజమాని ఎవరో తెలియకపోతే, అతని న్యాయబద్ధత మరియు విశ్వసనీయత తెలియకపోతే, అలాంటి పరిస్థితిలో దానిని విస్మరించాలి మరియు దానిని పట్టించుకోకూడదు, అది షరియత్ కు వ్యతిరేకంగా లేకపోయినా సరే. మరి అది చాలా అసత్య విషయాలను కలిగి ఉంటే, దాని అసత్యతను సూచించే మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ పై అబద్ధంగా మోపబడిన మరియు అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని ప్రవేశపెట్టే విషయాలను కలిగి ఉంటే, మరి ఎలా?

మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«مَنْ قَالَ عَلَيَّ مَا لَمْ أَقُلْ؛ فَلْيَتَـبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ».

ఎవరైతే నేను చెప్పని విషయాన్ని నాపై ఆపాదిస్తాడో, అతడు తన నివాసాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి. మరియు ఈ వాగ్దానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అబద్ధంగా ఆపాదించినవాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలకని మాటలను తన మాటలుగా చెప్పి, ఆయనపై స్పష్టమైన మరియు ప్రమాదకరమైన అబద్ధం పలికాడు. అటువంటి వాడికి ఈ ఘోరమైన హెచ్చరిక సరిగ్గా సరిపోతున్నది, మరియు అతని కొరకు ఈ హెచ్చరిక ఎంతో న్యాయమైనది - అతను పశ్చాత్తాపం చెందనంత వరకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై తన ఈ అబద్ధమైన వాగ్దానాన్ని ప్రజలకు తెలియజేయనంత వరకు; ఎందుకంటే ఎవడైనా ప్రజల మధ్య అసత్యాన్ని వ్యాప్తి చేసి, దానిని ధర్మానికి ఆపాదిస్తే అది అతని పశ్చాత్తాపం సరైనది కాదు అని తెలియజేస్తున్నది - అది బహిరంగంగా ప్రకటించబడనంత వరకు మరియు ప్రజలకు అతని అబద్ధం నుండి తిరిగి వచ్చినట్లు తెలియజేయనంత వరకు; మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు ప్రకారం:

﴿إِنَّ ٱلَّذِينَ يَكۡتُمُونَ مَآ أَنزَلۡنَا مِنَ ٱلۡبَيِّنَٰتِ وَٱلۡهُدَىٰ مِنۢ بَعۡدِ مَا بَيَّنَّٰهُ لِلنَّاسِ فِي ٱلۡكِتَٰبِ أُوْلَٰٓئِكَ يَلۡعَنُهُمُ ٱللَّهُ وَيَلۡعَنُهُمُ ٱللَّٰعِنُونَ159 إِلَّا ٱلَّذِينَ تَابُواْ وَأَصۡلَحُواْ وَبَيَّنُواْ فَأُوْلَٰٓئِكَ أَتُوبُ عَلَيۡهِمۡ وَأَنَا ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ160﴾

నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను - ప్రజల కొరకు దివ్యగ్రంథాలలో స్పష్టపరచిన పిదప కూడా - దాచుతారో! వారిని అల్లాహ్ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు.

కాని ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, అపార కరుణా ప్రదాతను. [అల్ బఖర: 159-160] పరమ పవిత్రుడైన అల్లాహ్ ఈ పవిత్రమైన ఆయతులో స్పష్టంగా తెలియజేస్తున్నాడు: సత్యం నుండి ఏదైనా దాచినవారు, దానిని సరిదిద్దడం మరియు స్పష్టీకరించడం చేసిన తరువాత మాత్రమే వారి పశ్చాత్తాపం సరైనది అవుతుంది. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసుల కొరకు ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించి, ఆయనకు సంపూర్ణ శాసనాన్ని ప్రసాదించి, దానిని పరిపూర్ణం చేసి, స్పష్టీకరించి ఆ తరువాతనే ఆయనను తన వద్దకు తీసుకున్నాడు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾

ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3]

ఈ వసీయతు ఆదేశాన్ని కల్పించిన వ్యక్తి పద్నాలుగవ శతాబ్దంలో వచ్చి, ప్రజలపై కొత్త ధర్మాన్ని రుద్దాలని ప్రయత్నించాడు, దాని ప్రకారం అతడి ఆదేశాలను అనుసరించినవారు స్వర్గంలో ప్రవేశిస్తారు, మరియు ఆతడి ఆదేశాలను అనుసరించని వారు స్వర్గానికి నోచుకోకుండా నరకంలో ప్రవేశిస్తారు, ఈ వసీయతును ఖుర్ఆన్ కంటే గొప్పదిగా మరియు ఉత్తమంగా చేయాలని అతను కోరుకుంటున్నాడు, ఇందులో అతను ఈ కల్పితాలు చేర్చినాడు: దీన్ని వ్రాసి ఒక ఊరి నుండి మరొక ఊరికి లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపిన వారికి స్వర్గంలో కోట నిర్మించబడుతుంది, దీన్ని వ్రాయని మరియు పంపని వారికి ప్రళయదినము నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షఫాఅత్ నిషేధించబడుతుంది, ఇది అత్యంత హేయమైన మరియు అసహ్యకరమైన పచ్చి అబద్ధం. ఈ వసీయత్ యొక్క అబద్ధాన్ని స్పష్టంగా ఎత్తి చూపించే నిదర్శనాలలో ఒకటి, మరియు ఆ అబద్ధాన్ని కల్పించిన వ్యక్తి యొక్క సిగ్గులేనితనాన్ని, నిర్లజ్జతను, అబద్ధం చెప్పడంలో అతని ధైర్యాహంకారాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతున్నది. ఎందుకంటే పవిత్రమైన ఖుర్ఆన్ కరీమ్ ను వ్రాసి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపినవారు, లేదా ఒక స్థలం నుండి మరొక స్థలానికి పంపినవారైనా సరే, ఒకవేళ ఖుర్ఆన్ ప్రకారం నడుచుకోకపోతే ఎటువంటి ప్రతిఫలమూ పొందనప్పుడు, ఈ అబద్ధాలను రచించి వాటిని ప్రచారం చేసే వ్యక్తి అలాంటి ప్రతిఫలం ఎలా పొందగలడు? ఎవరైనా ఖుర్ఆన్ ను వ్రాయకపోయినా, దానిని ఒక దేశం నుండి మరొక దేశానికి పంపక పోయినా, అతను ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షరీఅతును అనుసరించే విశ్వాసి అయితే, ఆయన షఫాఅతు నుండి వంచించబడడు. ఈ ఒకే అబద్దపు వాగ్దానమే, దాని అసత్యతను మరియు దానిని ప్రచారం చేసే వ్యక్తి యొక్క అబద్దాన్ని, దుర్భాషితనాన్ని, మూర్ఖత్వాన్ని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన హితబోధన నుండి అతని మార్గభ్రష్టతను సూచించడానికి సరిపోతుంది.

ఈ వసీయతులో - పైన పేర్కొన్నవే కాకుండా - ఇంకా ఇతర విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ దాని అసత్యతను, అమాన్యతనే నిరూపిస్తున్నాయి. దానిని కల్పించిన వ్యక్తి తాను చెబుతున్నది నిజమేనని దాని సత్యతపై వెయ్యి సార్లు ప్రమాణం చేసినా, లేదా ఒకవేళ తన మాట అబద్ధమైనదైతే తనకు అత్యంత తీవ్రమైన శిక్షను విధించమని శపించుకున్నా – అతని మాట నిజం కాజాలదు, అతడు సత్యవంతుడు కాలేడు. అల్లాహ్‌ మీద ప్రమాణం చేసి చెబుతున్నాం – ఇది అత్యంత మూర్ఖమైన మరియు అతి చెడ్డదైన తప్పుడు ప్రకటనలలో ఒకటి. మేము అల్లాహ్ సాక్షిగా, మాతో ఉన్న దేవదూతల సాక్షిగా ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఈ వ్రాతను చూసిన ముస్లింలు మన ప్రభువు సాక్ష్యంగా ఇలా పలుకవలెను - ఈ వసీయతులు ప్రవక్త ముహమ్మద్ ﷺ పైన కల్పించబడిన అబద్ధాలు, కల్పనలు మాత్రమే. ఈ అబద్ధాలను ప్రచారం చేసినవారిని అల్లాహ్ అవమానించుగాక! వారికి తగిన శిక్ష విధించుగాక!

ఇంతకు ముందు చెప్పిన వాటితో పాటు, ఈ వసీయత్ అబద్ధమని, అసత్యమని నిరూపించగలిగే మరో ఎన్నో విషయాలు ఈ వసీయత్‌లోని వచనాల నుండే స్పష్టమవుతున్నాయి. అవి ఈ క్రింద ఉన్నాయి:

మొదటి విషయం: ఇందులో ఇలా చెప్పబడింది: (ఎందుకంటే శుక్రవారం నుండి శుక్రవారం వరకు ఇస్లాం ధర్మం లో లేని స్థితిలో లక్షా అరవై వేల మంది మరణించారు); ఎందుకంటే ఇది అగోచర జ్ఞానం, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తరువాత వహీ నిలిచిపోయింది, మరియు ఆయన జీవితంలో ఆయనకు అగోచర జ్ఞానం తెలియదు, మరి మరణం తరువాత ఎలా తెలుస్తుంది; దీనికి సంబంధించిన పరమ పవిత్రుడైన అల్లాహ్ వాక్కు:

﴿قُل لَّآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ...﴾

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు." [అల్ అన్'ఆమ్: 50] అల్లాహ్ వాక్కు:

﴿قُل لَّا يَعۡلَمُ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ ٱلۡغَيۡبَ إِلَّا ٱللَّهُ...﴾

వారితో అను: "ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు... [అన్-నమ్ల్: 65] ప్రామాణికమైన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయన ఇలా సెలవిచ్చారు:

«يُذَادُ رِجَالٌ عَنْ حَوْضِي يَوْمَ القِيَامَةِ، فَأَقُولُ: يَا رَبِّ! أَصْحَابِي أَصْحَابِي، فَيُقَالُ لِي: إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ، فَأَقُولُ كَمَا قَالَ العَبْدُ الصَّالِحُ: ﴿وَكُنتُ عَلَيۡهِمۡ شَهِيدٗا مَّا دُمۡتُ فِيهِمۡۖ فَلَمَّا تَوَفَّيۡتَنِي كُنتَ أَنتَ ٱلرَّقِيبَ عَلَيۡهِمۡۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ [المائدة: 117]».

{ప్రళయదినాన నా నీటి కొలనుపై కొంతమంది వ్యక్తులు నిలిపివేయబడతారు. అప్పుడు నేను: 'ఓ ప్రభూ! నా సహచరులు, నా సహచరులు' అని వేడుకుంటాను. దానికి సమాధానంగా: 'నీకు తెలియదు, నీ తరువాత వారు ఏమేం చేసినారో' అని చెప్పబడుతుంది. అప్పుడు నేను ధర్మాత్ముడైన దాసుడు చెప్పినట్లే చెప్తాను: 'నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. మరియు నీవే ప్రతి దానికి సాక్షివి!' }[మాయిదా 5:117]

రెండవది: ఈ వసీయతు అసత్యమని మరియు అది అబద్ధమని సూచించే అంశాలలో ఒకటి: దానిలో చెప్పబడిన విషయం: (దీనిని వ్రాసినవాడు పేదవాడైతే అల్లాహ్ అతనిని ధనవంతుడిని చేస్తాడు, లేదా అప్పులపాలైతే అల్లాహ్ అతని అప్పును తీర్చుతాడు, లేదా అతని పై పాపం ఉంటే అల్లాహ్ అతనికి మరియు అతని తల్లిదండ్రులకు ఈ వసీయతు యొక్క బరకతుతో క్షమిస్తాడు) ... చివరి వరకు. ఇది అబద్ధాలలో అతి పెద్దది మరియు దాని కల్పితతను స్పష్టంగా చూపించే సాక్ష్యాలలో ఒకటి, అల్లాహ్ మరియు ఆయన ఆరాధకుల పట్ల సిగ్గు లేకపోవడం; ఎందుకంటే ఈ మూడు విషయాలు ఖుర్ఆన్‌ను కేవలం వ్రాసినంత మాత్రాన లభించనపుడు, ఈ అబద్ధపు వసీయతు వ్రాసిన వారికి ఎలా లభిస్తాయి? ఈ దుష్టుడు ప్రజలను మోసం చేయాలని, వారు ఈ సిఫారసును నమ్మాలని, వారు దానిని వ్రాసి ఈ తప్పుడు ప్రతిష్టను కొనసాగించాలని కోరుతున్నాడు. అల్లాహ్ తన ఆరాధకులకు సంపదను పొందటానికి, అప్పు తీర్చుకోవటానికి, పాపములను క్షమించబడటానికి నిర్దేశించిన మార్గాలను వదిలివేయాలని కోరుతున్నాడు. అపజయం కారణాల నుండి, తప్పుడు కోరికలు మరియు షైతాన్ కు విధేయత నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.

మూడవ విషయం: ఈ వసీయతు చెల్లుబాటు కాదు అనడాన్ని నిరూపించే అంశాలలో ఒకటి, ఇందులో చెప్పబడిన ఈ విషయం: (అల్లాహ్ యొక్క ఆరాధకులలో ఎవడైతే దీనిని వ్రాయనివాడు; అతని ముఖం ఈ లోకంలో మరియు పరలోకంలో నల్లగా మారుతుంది). ఇది కూడా అతి హేయమైన అబద్ధాలలో ఒకటి, మరియు ఈ వసీయతు అసత్యమని మరియు దాని కల్పితకర్త అబద్ధం చెబుతున్నాడని స్పష్టమైన సాక్ష్యాలలో ఒకటి. ఒక తెలివైన మనిషి ఎలా ఈ వీలునామాను వ్రాయగలడు, ఇది ఒక అపరిచిత వ్యక్తి పదహారవ శతాబ్దంలో తీసుకువచ్చాడు, దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అపవాదిస్తూ, దాన్ని వ్రాయనివారి ముఖం ఈ లోకంలో మరియు పరలోకంలో నల్లబడుతుందని, దాన్ని వ్రాసినవారు పేదరికం నుండి ధనవంతులవుతారని, అప్పుల నుండి విముక్తులవుతారని, మరియు చేసిన పాపాలు క్షమించబడతాయని చెప్పడం ఎలా సాధ్యం?

పవిత్రుడైన అల్లాహ్! ఇది ఒక గొప్ప అపనింద!! మరియు సాక్ష్యాలు మరియు వాస్తవం ఈ అపవాదకుని అబద్ధాన్ని మరియు అల్లాహ్ పై అతని ధైర్యాన్ని, అల్లాహ్ మరియు ప్రజల నుండి అతని నిర్లజ్జతను, సిగ్గులేని తనానికి సాక్ష్యమిస్తున్నాయి. ఎందుకంటే ఈ అనేక జాతులు ఈ వసీయతులో ఆజ్ఞాపించినట్లు దీన్ని రాయలేదు, పంపిణీ చేయలేదు అయినా వారి ముఖాలు నల్లబడలేదు, మరియు ఇక్కడ అల్లాహ్ తప్ప మరెవ్వరూ లెక్కించలేని అనేక మంది దీన్ని అనేక సార్లు రాశారు, కానీ వారి ఋణం తీర్చబడలేదు, వారి పేదరికం తొలగించబడలేదు. కాబట్టి మనం అల్లాహ్ ను మన హృదయాలను వక్రమార్గంలో మళ్ళించకుండా మరియు పాపాల మురికి నుండి కాపాడమని కోరుకుందాము. ఇవి అతి ఉత్తమమైన మరియు అతి గొప్ప గ్రంథమైన ఖుర్ఆన్ ను వ్రాసిన వారికి షరీఅతు ద్వారా లభించే లక్షణాలు మరియు ప్రతిఫలాలు కాదు, మరి అబద్ధపు వాక్యములు, అనేక మిథ్యలు, అనేక రకాల అవిశ్వాసాలు కలిగి ఉన్న వక్రతను వ్రాసిన వారికి ఎలా లభిస్తాయి? పరమ పవిత్రుడైన అల్లాహ్!! అబద్ధం పలికిన వారిపై ఆయన ఎంత దయగలవాడు!

4: ఈ వసీయతు పూర్తిగా అబద్ధమని తెలియజేసే మరో స్పష్టమైన ఋజువు వసీయతులోని ఈ వాక్యం: "దీనిని నమ్మినవాడు నరకాగ్ని శిక్ష నుండి తప్పించుకుంటాడు, మరియు దీనిని తిరస్కరించినవాడు అవిశ్వాసి అవుతాడు", ఇది కూడా అతి ఘోరమైన అబద్ధపు ధైర్యానికి ఒక ఉదాహరణ. ఈ అబద్ధపు ఆవ్యంతనాన్ని చేసినవాడు, సమస్త ప్రజలను తన అబద్ధాన్ని నమ్మమని పిలుస్తున్నాడు. ఇంకా, ఎవరు దీన్ని నమ్ముతారో వారు నరకదండన నుండి తప్పించుకుంటారని, మరియు ఎవరు దీన్ని అంగీకరించకపోతారో వారు కాఫిరులు అవుతారని దురుద్దేశంతో ప్రకటిస్తున్నాడు. అల్లాహ్ పై అబద్దమును అపాదించిన ఈ అబద్ధాలకోరు, అల్లాహ్ పేరుతో అసత్యమును పలికినాడు. ఈ వసీయతును నమ్మినవాడు సత్యతిరస్కారి (కాఫిర్) అవ్వడానికి అర్హుడు, ఈ వసీయతును తిరస్కరించినవాడు కాదు; ఎందుకంటే ఇది అబద్ధం, అసత్యం మరియు ఎటువంటి నిజఆధారం లేని ఒక పచ్చి అబద్ధం. మేము అల్లాహ్ ను సాక్షిగా పెట్టి ఇది అబద్ధమని, దీన్ని కల్పించినవాడు అబద్ధాలకోరని, అల్లాహ్ అనుమతించని విషయాలను ప్రజలకు చట్టంగా చేయాలని, వారి ధర్మంలో లేని విషయాలను చేర్చాలని ప్రయత్నిస్తున్నాడని ప్రకటిస్తున్నాము. అల్లాహ్ ఈ ధర్మాన్ని ఈ సమాజంలో ఈ అబద్ధపు వసీయతు కల్పించబడక ముందే అంటే పద్నాలుగు శతాబ్దాల క్రితమే సంపూర్ణం చేశాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి: ఓ పాఠకులారా మరియు ఓ సోదరులారా! మరియు ఇలాంటి అబద్ధాలను నమ్మటానికి మరియు అవి మీ మధ్య ప్రాచుర్యం పొందటానికి దూరంగా ఉండండి. ఎందుకంటే సత్యం దాని మీద తళుకు, వెలుగును కలిగి ఉంటుంది, అది దాని అన్వేషకుడికి గందరగోళం కలిగించదు. కాబట్టి సత్యాన్ని దాని ఋజువుల ఆధారంతో అన్వేషించండి, మరియు మీకు క్లిష్టంగా ఉన్న విషయాల గురించి జ్ఞానులని అడగండి, మరియు అబద్ధం చెప్పే వారి ప్రమాణాలపై మోసపోవద్దు. ఎందుకంటే శపించబడిన ఇబ్లీస్ మీ తల్లిదండ్రులు ఆదం మరియు హవ్వకు, అతను వారికి సలహాదారుడని ప్రమాణం చేశాడు, మరియు అతను అత్యంత ద్రోహి మరియు అబద్ధం చెప్పేవారిలో అగ్రగణ్యుడని, అల్లాహ్ అతని గురించి ఇలా చెప్పినాడు.

﴿وَقَاسَمَهُمَآ إِنِّي لَكُمَا لَمِنَ ٱلنَّٰصِحِينَ21﴾

మరియు (షైతాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: "నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని! [అల్ అ'రాఫ్: 21] కాబట్టి మీరు అతని గురించి జాగ్రత్తగా ఉండండి, మరియు అతని అనుచరుల గురించి, అబద్ధపు వాగ్దానాలు చేసే వారి గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అతని కొరకు మరియు వారి కొరకు ఎన్నో అబద్ధపు ప్రమాణాలు, ద్రోహపు ఒప్పందాలు, మరియు మోసానికి, భ్రష్టు పట్టించడానికి అలంకరించబడిన మాటలు ఉన్నాయి! ఈ అబద్ధాలను కల్పించిన వ్యక్తి ఇక్కడ ప్రస్తావించిన అనైతిక కార్యాలు (ముంకరాత్) నిజంగా జరుగుతున్నాయి. కానీ ఖుర్ఆన్ కరీం మరియు పవిత్ర సున్నతులు వాటిని గురించి ముందుగానే తీవ్రంగా హెచ్చరించాయి. ఈ రెండింటిలోనే సరైన మార్గదర్శకం మరియు సంపూర్ణ పరిష్కారం ఉంది.

ప్రళయ సూచనల గురించి ప్రస్తావించిన విషయానికి వస్తే, ప్రవక్త హదీథులు ప్రళయ సూచనలను స్పష్టంగా వివరించాయి, మరికొన్నింటిని పవిత్ర ఖురాన్ సూచించింది. దానిని తెలుసుకోవాలనుకునే వారు, సున్నతు పుస్తకాల్లో, ఇంకా జ్ఞానం మరియు విశ్వాసం కలిగిన పండితుల రచనల్లో వాటిని కనుగొంటారు. ప్రజలకు ఈ విధమైన అబద్ధం మరియు దాని మోసం గురించిన వివరణ, సత్యాన్ని అసత్యంతో కలపడం గురించి వివరణ అవసరం లేదు. నన్ను, మిమ్మల్ని మరియు ముస్లింలందరిని షైతానుల కీడు నుండి, అపమార్గపు ప్రలోభాల నుండి, తారుమారు చేసే వారి వక్రీకరణల నుండి, అల్లాహ్ శత్రువులైన తప్పుడు వ్యక్తుల మోసాల నుండి రక్షించమని అల్లాహ్ తో వేడుకుంటున్నాను. వారు తమ నోళ్లతో అల్లాహ్ యొక్క జ్యోతిని ఆర్పివేయాలని, ఆయన ధర్మాన్ని కలవరపెట్టాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ అల్లాహ్ తన వెలుగును పూర్తి చేస్తాడు, తన ధర్మానికి తోడ్పడతాడు, షైతానులు మరియు వారి అనుచరులైన అవిశ్వాసులు మరియు నాస్తికులు ఇష్టపడకపోయినా సరే. మేము అల్లాహ్ ను వేడుకుంటున్నాము! ఆయన ముస్లింల పరిస్థితులను సంస్కరించుగాక మరియు వారికి సత్యాన్ని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దానిపై నిలబడే ధైర్యాన్ని ప్రసాదించుగాక మరియు అన్ని పాపాల నుండి పరమ పవిత్రుడైన అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణామయుడు మరియు అన్నిటికీ సమర్ధుడు. అల్లాహ్ యే మనకు చాలు మరియు గొప్ప కార్యనిర్వాహకుడైన, ఎంతో శక్తి,సామర్థ్యాల గల మహోన్నతుడైన, గొప్పవాడైన అల్లాహ్ తోనే మన ఆశలు.

స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. సత్యవంతులైన, నమ్మకస్తులైన ఆయన దాసుడు మరియు సందేశహరుడు అయిన మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, ప్రళయదినం వరకు దాతృత్వంతో అనుసరించిన వారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

 

***