دَفْنُ المَوتَى فِي المَسَاجِدِ
మస్జిదులలో మృతులను సమాధి చేయడం
لِسَمَاحَةِ الشَّيْخِ العَلَّامَةِ
عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللهِ بْنِ بَازٍ
رَحِمَهُ اللهُ
రచన గౌరవనీయులైన షేఖ్
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
పదకొండవ సందేశము:
మస్జిదులలో మృతులను సమాధి చేయడం
అల్లాహ్ పేరుతో, సకల స్తోత్రాలు మరియు ప్రశంసలు అల్లాహ్'కే శోభిస్తాయి మరియు దైవప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన మార్గమును అనుసరించిన వారిపై శాంతి, శుభాలు కురియుగాక! )అమ్మా బాద్:)ఆ తరువాత
హిజ్రీ 1415, 4వ నెల 17వ తేదీన విడుదలైన 'ఖర్తూమ్' పత్రికను నేను పరిశీలించాను; అందులో సయ్యద్ ముహ్మద్ హసన్ ఇద్రీసి సమాధి, ఆయన తండ్రి సమీపంలో, వారి మస్జిద్ లో, ఉమ్ దుర్మాన్ నగరంలో, నిర్మించబడినట్లు ఒక ప్రకటన ప్రచురించబడింది... మొదలైనవి.
అల్లాహ్ ముస్లింలకు సలహా ఇవ్వడం మరియు చెడు పనుల నుండి నివారించడం గురించి ఆదేశించినందున, మస్జిదుల్లో సమాధి చేయడం అనుమతించబడలేదని, ఇది షిర్క్ కు దారితీసే మార్గాలలో ఒకటని, మరియు అల్లాహ్ యూదులు మరియు క్రైస్తవులను దూషించిన పనులలో ఒకటని, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శపించినట్లు, సహీహైన్ లో ఆయెషా రదియల్లాహు అన్హా ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, నేను హెచ్చరించవలసిన అవసరం ఉందని అనిపించింది.
«لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ».
యూదులపై మరియు క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా చేసుకున్నారు. సహీహ్ ముస్లింలో జుందబ్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ، أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ؛ فَإِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ».
“వినండి. మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల మరియు సజ్జనుల సమాధులను ఆరాధనా (సజ్దా) స్థలాలుగా చేసుకునేవారు. జాగ్రత్త! మీరు మాత్రం సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోకండి. నేను దీని నుండి మిమ్మల్ని వారిస్తున్నాను”. ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి.
ప్రతి ప్రదేశంలో ఉన్న ముస్లిములు - ప్రభుత్వాలు మరియు ప్రజలు - అల్లాహ్ కు భయపడటం, ఆయన నిషేధించిన వాటి నుండి జాగ్రత్తపడటం మరియు తమ మృతులను మస్జిదుల వెలుపల ఖననం చేయటం తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు రదియల్లాహు అన్హుమ్ మస్జిదుల వెలుపల మృతులను ఖననం చేసేవారు. అలాగే వారి సత్ప్రవర్తనను అనుసరించే వారూను.
మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులైన అబూబకర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా సమాధులు ఆయన మస్జిద్ లో ఉండటం, మస్జిద్ లలో మరణించినవారిని సమాధి చేయడానికి ఆధారం కాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో, ఆయెషా రదియల్లాహు అన్హా ఇంటిలో సమాధి చేయబడ్డారు. ఆ తరువాత ఆయన సహచరులు కూడా అక్కడే సమాధి చేయబడ్డారు. వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ మస్జిద్ ను విస్తరించినప్పుడు, హిజ్రీ మొదటి శతాబ్దం చివరలో ఆ గదిని మస్జిద్ లో చేర్చారు. దీనిని అహ్లుల్ ఇల్మ్ (జ్ఞానులు) వ్యతిరేకించారు, కానీ ఆయన దానిని విస్తరణకు అడ్డంకి కాదని, మరియు విషయం స్పష్టంగా ఉందని భావించారు.
అందువల్ల ప్రతి ముస్లిముకు స్పష్టమవుతున్నది ఏమిటంటే: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన ఇద్దరు సహచరులు రదియల్లాహు అన్హుమా మస్జిద్ లో సమాధి చేయబడలేదు, విస్తారణ కారణంగా వారిని మస్జిద్ లో చేర్చబడటం మస్జిద్ లలో సమాధి చేయడానికి అనుమతిగా పరిగణించ బడదు; ఎందుకంటే ఖననం చేయబడినపుడు వారు మస్జిద్ లో లేరు, వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం స్వగృహంలో ఉన్నారు, మరియు ఖలీఫా వలీద్ చేసిన పని ఈ విషయంలో ఎవరికీ ప్రమాణంగా లెక్కించబడదు, ప్రమాణం కేవలం ఖుర్ఆన్ మరియు సున్నతులలో, మరియు సలఫ్ ఉల్ ఉమ్మా యొక్క ఏకాభిప్రాయంలో ఉంది, రదియల్లాహు అన్హుమ్, మరియు మేము వారిని అనుసరించేవారిలో ఉండాలని అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించుగాక.
దీనిని సలహా ఇచ్చి, బాధ్యత నుండి విముక్తి చెందడానికి 1415 హిజరీ 5వ నెల 14వ తేదీన లిఖించారు.
మరియు అల్లాహ్ మాత్రమే సౌభాగ్యమును కలిగించేవాడు. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, మరియు సన్మార్గంలో ఉన్నవారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***