حُكْمُ السِّحْرِ وَالكِهَانَةِ
وَمَا يَتَعَلَّقُ بِهَا
మంత్రజాలం, జ్యోతిష్కం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము
لِسَمَاحَةِ الشَّيْخِ العَلَّامَةِ
عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللهِ بْنِ بَازٍ
رَحِمَهُ اللهُ
రచన గౌరవనీయులైన షేఖ్
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
తొమ్మిదవ సందేశము:
మంత్రజాలం, జ్యోతిష్కం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము1
అల్హమ్దులిల్లాహ్, వహదహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్. (సర్వ స్తోత్రములు, కృతజ్ఞతలు ఒకే ఒక్కడైన అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు అంతిమ ప్రవక్త పై శుభాలు శాంతి కురియుగాక). అమ్మా బాద్:
ప్రస్తుత కాలంలో మంత్రజాలం చేసేవారు చాలా మంది కనబడుతున్నారు. వారు వైద్యము వచ్చినట్లు వాదించి మంత్రజాలము, జోతిష్కము పద్ధతి ద్వారా వైద్యం చేస్తున్నారు. వీరు పలు ప్రాంతములలో వ్యాపించి ఉన్నారు. వీరు అజ్ఞాన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండటం వలన అల్లాహ్ మరియు ఆయన దాసుల ప్రయోజనం కొరకు నేను ఇస్లాం మరియు ముస్లిములకు పెద్ద ప్రమాదమున్న ఈ పద్ధతిని స్పష్టపరచదలచాను. అందులో అల్లాహేతరులతో సంబంధము మరియు ఆయన ఆదేశమునకు,ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశమునకు వ్యతిరేకత ఉన్నదని తెలియపరచదలచాను.
కావున నేను అల్లాహ్ సహాయముతో చెబుతున్నాను వైద్యం చేయించుకోవటం సమ్మతమే. ఒక ముస్లిం అంతర్గత రోగాల, సర్జరీ, నరాల లేదా అటువంటి వాటి డాక్టర్ వద్దకు వెళ్ళాలి. అతనితో తమ రోగమును పరిశోధించుకుని వైద్యశాస్త్రంలో తెలిపిన విధంగా చట్టబద్ధంగా అనుమతించబడిన ఔషధాలతో చికిత్స చేయించుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ కారకాలను తీసుకోవడం అనేది అల్లాహ్ పై ఉన్న నమ్మకమునకు వ్యతిరేకము కాదు. నిశ్చయంగా అల్లాహ్ రోగమును పుట్టించాడు దానికి తోడుగా దాని చికిత్సనూ పుట్టించాడు. దానిని తెలుసుకునేవారు తెలుసుకుంటారు. తెలుసుకోలేనివారు తెలుసుకోరు. అల్లాహ్ తన దాసులపై నిషేధించిన వాటిలో వారి కొరకు చికిత్సను ఉంచలేదు.
ఒక రోగి తన రోగము గురించి తెలుసుకోవటం కొరకు అగోచర విషయాల జ్ఞానం తెలుసని వాదించే జ్యోతిష్కుల వద్దకు వెళ్ళటం ధర్మసమ్మతం కాదు. అలాగే వారు తెలియపరచే విషయాలలో వారు సత్యవంతులని విశ్వసించటం కూడా సమ్మతం కాదు. ఎందుకంటే వారు ఊహాగానాలు చేస్తున్నారు లేదా తాము తలచుకున్న వాటిపై సహాయం కొరకు జిన్నులను ప్రత్యక్షపరుస్తున్నారు. ఈ వ్యక్తులు అగోచర విషయాలు తెలుసని దావా చేస్తే, వారు అవిశ్వాసులు మరియు మార్గభ్రష్టులుగా పరిగణించబడతారు.
ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ తన సహీహ్ హదీథు గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని నమోదు చేసినారు:
«مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ، لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ يَوْمًا».
“ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.”
అబూ హురైర రదియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నుండి ఉల్లేఖిస్తున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
«مَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ».
ఒక జ్యోతిష్యుని వద్దకు వచ్చి అతను చెప్పినదంతా విశ్వసించినవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని తిరస్కరించాడు. అబూ దావూద్ మరియు అహలుస్సుననుల్ అర్బఅ దీనిని నమోదు చేసినారు, మరియు హాకిమ్ దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ పదాలతో ప్రామాణికమైనదిగా తెలియపరచారు:
«مَنْ أَتَى عَرَّافًا أَوْ كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ».
ఎవరైన జ్యోతిష్కుని వద్దకు లేదా యాజకుని వద్దకు వెళ్ళి అతను చెబుతున్నది నిజమని విశ్వసిస్తాడో అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించాడు.
ఇమ్రాన్ ఇబ్నె హుసైన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
«لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ، وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ».
“ఎవరైతే శకునం తీస్తాడో లేదా తన కొరకు తీయించుకుంటాడో; లేదా జ్యోతిష్యం చెప్తాడో లేదా తన కొరకు చెప్పించుకుంటాడో; లేదా చేతబడి చేస్తాడో లేదా తన కొరకు చేయించుకుంటాడో; అటువంటి వాడు మాలోని వాడు కాడు. మరియు ఎవరైతే జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి, అతడు చెప్పిన దానిని విశ్వసిస్తాడో, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించాడు.” దీనిని బజ్జార్ జయ్యిద్ సనద్'తో ఉల్లేఖించారు.
ఈ హదీథులో జోతిష్యుల వద్దకు, బాబాల వద్దకు, పూజారుల వద్దకు, చేతబడి చేసేవారి వద్దకు వెళ్ళటం నుండి, ఇంకా వారిని అడగటం మరియు వారు చెప్పిన వాటిని నమ్మటం నుండి వారింపు మరియు దానిపై హెచ్చరిక ఉన్నది;
వారు కొన్ని విషయాలలో నిజం చెప్పినట్టు కనిపించినా, లేదా వారి వద్దకు వచ్చే జనాల సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాళ్లపై మోసపోవడమూ, ప్రభావితమవడమూ అనుచితం. ఎందుకంటే వారు అజ్ఞానులు, మూర్ఖులు; ప్రజలు వాళ్లపై మోహపడకూడదు. ప్రవక్త ముహమ్మద్ ﷺ వారిని కలవడం, వారిని ప్రశ్నించడం, వారిని నమ్మడాన్ని నిషిద్ధం చేశాడు. ఎందుకంటే ఈ పని లోపభూయిష్టమైనది, తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే దాని వలె ఉంది, దాని పరిణామాలు విషమంగా ఉంటాయి. వారు అబద్ధకారులు, అవినీతిపరులు.
అలాగే ఈ హదీథులలో జ్యోతిష్కుల, మంత్రజాలము చేసేవారి అవిశ్వాసంపై ఆధారం ఉన్నది. ఎందుకంటే వారు అగోచర విషయాల జ్ఞానం ఉన్నదని వాదిస్తున్నారు. ఇది అవిశ్వాసము మరియు వీరు తమ ఉద్దేశమును చేరుకోవటానికి జిన్నుల సహకారం తీసుకుంటున్నారు. మరియు అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధిస్తున్నారు. ఇది అల్లాహ్ పట్ల అవిశ్వాసము మరియు ఆయనతో పాటు సాటి కల్పించటం అవుతుంది. అగోచర విషయాల జ్ఞానం ఉన్నదని వాదించేవారిని నమ్మేవారు వారిలాంటి వారే అవుతారు. ఈ విషయములను వారితో నేర్చుకునే ప్రతీ ఒక్కడి నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరవాద రహితుడు.
ఒక ముస్లింకి వారు తెలిపిన విధంగా వైద్యం చేయటం సమ్మతం కాదు అంటే చేతబడితో గీతలు గీయటం, తూటాలను పేల్చటం మరియు అటువంటివే వారికి తెలిసినటువంటి తావీజులు, పరియాచకములు. ఎందుకంటే ఇవన్ని జ్యోతిష్కములో నుంచివి మరియు ప్రజలను సందేహములో పడవేసేవి. వీటిపై ఎవరైతే సంతుష్టపడతాడో అతడు వారి అసత్య, అవిశ్వాస కార్యాల్లో ³వారికి దోహదపడినవాడు అవుతాడు.
అలాగే ఏ ముస్లిం కొరకు కూడా వారి వద్దకు వెళ్ళి వారితో ఆ వ్యక్తి గురించి దర్యాప్తు చేయటం, అతని యొక్క కుమారునితో లేదా అతని దగ్గరి బంధువుతో వివాహం చేయవలసి ఉన్నదో లేదా, ఆ భార్యాభర్తల మధ్య, వారి కుటుంబము మధ్య ఉన్న ప్రేమ, విశ్వసనీయత లేదా శతృత్వం, విభేదాల గురించి మరియు అటువంటి వాటి గురించి దర్యాప్తు చేయటం సమ్మతం కాదు: ఎందుకంటే ఇది అగోచర జ్ఞానములోనిది. అది అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు.
కావున కార్యనిర్వాహకుల, ధార్మిక వ్యవహారములను పరిశోధించేవారి, ఇంకా అధికారము, సామర్ధ్యము కలవారి బాధ్యత ఏమిటంటే వారు జ్యోతిష్కుల, బాబాల, పురోహితుల వద్దకు వెళ్ళటం నుండి నివారించాలి, మరియు బజారులలో ఇతర ప్రదేశములలో వారు దానిని ఉపయోగించటం నుండి నిరోధించాలి. వారిని కఠినంగా వారించాలి, వారి వద్దకు వెళ్ళే వారిని వారించాలి.
ఇలా చేతబడి నిషేధిత అవిశ్వాసాల్లోనిది; ఎలాగైతే అల్లాహ్ ఇద్దరు దైవదూతల విషయంలో ఇలా సెలవిచ్చాడు:
﴿...وَمَا يُعَلِّمَانِ مِنۡ أَحَدٍ حَتَّىٰ يَقُولَآ إِنَّمَا نَحۡنُ فِتۡنَةٞ فَلَا تَكۡفُرۡۖ فَيَتَعَلَّمُونَ مِنۡهُمَا مَا يُفَرِّقُونَ بِهِۦ بَيۡنَ ٱلۡمَرۡءِ وَزَوۡجِهِۦۚ وَمَا هُم بِضَآرِّينَ بِهِۦ مِنۡ أَحَدٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡۚ وَلَقَدۡ عَلِمُواْ لَمَنِ ٱشۡتَرَىٰهُ مَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِنۡ خَلَٰقٖۚ وَلَبِئۡسَ مَا شَرَوۡاْ بِهِۦٓ أَنفُسَهُمۡۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ﴾
ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవదూతలు) ఇలా చెప్పే వారు: "నిశ్చయంగా మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్యతిరస్కారులు కాకండి." అయినప్పటికీ వారు (ప్రజలు), భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించేది (జాలవిద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే, దాని ద్వారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే, కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించే వానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియు వారు ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది! [అల్-బఖరహ్ 2:102]
గౌరవోన్నతమైన ఈ వచనాలు చేతబడి చేయటం అవిశ్వాసమని మరియు చేతబడి చేసేవారు భార్యాభర్తల మధ్య దూరమును కలుగచేస్తారని సూచిస్తున్నాయి. అలాగే చేతబడి చేయటం అన్నది స్వయంగా ఎటువంటి ప్రయోజనం గాని, నష్టం గాని కలుగచేయదని సూచిస్తున్నవి. అది విశ్వవిధాత అల్లాహ్ యొక్క అనుమతితో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పరమ పవిత్రుడైన అల్లాహ్ యే మంచి చెడులను సృష్టించాడు.
అలాగే గౌరవోన్నతమైన ఆయతులు చేతబడి నేర్చుకునే వారు తమకు లాభం కలిగించకుండా నష్టం కలిగించే వాటిని నేర్చుకుంటున్నారని మరియు వారికి అల్లాహ్ వద్ద ఎటువంటి భాగం లేదని సూచిస్తున్నాయి. ఇది వారికి ఇహపరాలలో కలిగే నష్ట తీవ్రత గురించి సూచించే పెద్ద హెచ్చరిక మరియు వారు తుచ్ఛమైన ధరలకు తమ ప్రాణములను అమ్మివేశారు. అందుకనే అల్లాహ్ దానిపై తన వాక్కులో వారిని ఇలా దూషించాడు:
﴿...وَلَبِئۡسَ مَا شَرَوۡاْ بِهِۦٓ أَنفُسَهُمۡۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ﴾
మరియు వారు ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది! [అల్-బఖర 2:102] షిరాఉ అంటే ఇక్కడ వర్తకం అర్ధము.
ఈ అబద్దాలు ఆపాదించేవారు, ముష్రికుల నుండి ఈ జ్ఞానాన్ని వారసత్వంగా పొందిన వారు, బలహీనమైన మనస్సులపై మోసగించటం వలన నష్టం మరింత పెరిగింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అల్లాహ్ మాకు చాలు మరియు ఆయనే ఉత్తమ సంరక్షకుడు.
మంత్రజాలము చేసేవారి, జ్యోతిష్యుల కీడు నుండి మరియు చేతబడి చేసేవారందరి కీడు నుండి మనం అల్లాహ్ వద్ద రక్షణను, భద్రతను కోరుతున్నాము. మరియు ముస్లిములను వారి కీడు నుండి రక్షించమని మరియు ముస్లిం పాలకులకు ప్రజలను వారి నుండి రక్షించే, అధికారులు వారి కీడు నుండి మరియు వారి దుష్చర్యల నుండి విముక్తి పొందే వరకు వారిలో అల్లాహ్ ఆదేశమును జారీ చేసే భాగ్యమును కలిగించమని అల్లాహ్ తో వేడుకుంటున్నాము. నిశ్చయంగా ఆయన అత్యంత ఔదార్యము గలవాడు, దాతృత్వము గలవాడు.
కావున పరమ పవిత్రుడైన అల్లాహ్ తన దాసుల కొరకు వారిపై చేతబడి వాటిల్లక ముందే దాని నుండి జాగ్రత్తపడే విషయాలను ధర్మబద్ధం చేశాడు మరియు అది వాటిల్లిన తరువాత దాని వైద్యం చేసుకునే వాటిని తన వైపు నుండి వారి కొరకు కారుణ్యముగా, వారి వైపు తన తరుపు నుండి ఉపకారముగా మరియు వారిపై తన అనుగ్రహమును పరిపూర్ణం చేసే విధంగా వారికి స్పష్టపరచాడు.
చేతబడి వాటిల్లక ముందు దాని ప్రమాదముల నుండి జాగ్రత్తపడే విషయాలు మరియు చేతబడి వాటిల్లిన తరువాత ధర్మబద్ధమైన సమ్మతమైన వాటి నుండి వైద్యం చేసుకునే విషయాలు ఈ క్రింద స్పష్టపరచబడ్డాయి, మరియు దాని వివరణ ఈ విధంగా ఉంది:
మొదట: చేతబడి వాటిల్లక ముందే దాని ప్రమాదముల నుండి జాగ్రత్త వహించవలసిన విషయాలు. వాటిలో ముఖ్యమైనవి, ప్రయోజనకరమైనవి: షరఈ అజ్కారులు, దుఆలు, శరణు వేడుకునే సున్నత్ పరమైన విధానాలతో భద్రతను కల్పించుకోవటం. వాటిలో నుంచి ప్రతీ ఫర్జ్ నమాజు చివరిలో సలాం పలికిన తరువాత ఆయతుల్ కుర్సీ చదవటం, అది దివ్య ఖుర్ఆన్ లోని గొప్ప వచనము. పరమ పవిత్రుడైన అల్లాహ్ వాక్కు:
﴿ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُۚ لَا تَأۡخُذُهُۥ سِنَةٞ وَلَا نَوۡمٞۚ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ مَن ذَا ٱلَّذِي يَشۡفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذۡنِهِۦۚ يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۖ وَلَا يُحِيطُونَ بِشَيۡءٖ مِّنۡ عِلۡمِهِۦٓ إِلَّا بِمَا شَآءَۚ وَسِعَ كُرۡسِيُّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۖ وَلَا يَـُٔودُهُۥ حِفۡظُهُمَاۚ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡعَظِيمُ255﴾
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. [అల్-బఖర: 255] ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నిద్రకు ఉపక్రమించే వేళ ఈ సూరాలు పఠించాలి:
«مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي لَيْلَةٍ، لَمْ يَزَلْ عَلَيْهِ مِنَ اللَّهِ حَافِظٌ، وَلَا يَقْرَبُهُ شَيْطَانٌ حَتَّى يُصْبِحَ».
“రాత్రి పూట ఆయతుల్ కుర్సీ పఠించిన వాడిపై అల్లాహ్ తరుపు నుండి ఒక రక్షకుడు నియమితుడవుతాడు. అతడు ఉదయం నిదుర మేల్కొనే వరకు షైతాను అతని దరిదాపులలోనికి రాడు.”
అందులో దీని పఠనం కూడా ఉంది:
﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ1﴾
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ1﴾
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ1﴾
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను! [అన్నాస్ 114:1] ప్రతీ ఫర్జ్ నమాజు తరువాత పఠించటం మరియు ఈ మూడు సూరాలను ఫజర్ నమాజు తరువాత, దినపు మొదటి వేళ ఉదయపు అద్కారులలో, మగ్రిబ్ నమాజు తరువాత, రాత్రి మొదటి వేళ సాయత్రపు అద్కారులలో మూడుసార్లు పఠించటం.
వాటిలో నుంచి రాత్రి మొదటి వేళలో సూరతుల్ బఖరా చివరి రెండు ఆయతులను పఠించుట అవి:
﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِۦۚ وَقَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ غُفۡرَانَكَ رَبَّنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ285﴾
ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది. సూరహ్ చివరి వరకు.
ప్రామాణికమైన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయన ఇలా సెలవిచ్చారు:
«مَنْ قَرَأَ الآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ».
ఎవరైతే రాత్రి సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు వాక్యాలను పఠిస్తాడో అవి అతనికి సరిపోతాయి. మరియు దీని అర్ధం అల్లాహ్ కు బాగా తెలుసు: అవి రెండు అతని కొరకు ప్రతీ చెడు నుండి (రక్షణ కొరకు) సరిపోతాయి. ఇంకా అందులో నుంచి రాత్రింబవళ్ళలో ఎప్పుడైనా, ఏదైనా నివాసము వద్ద లేదా ఎడారిలో లేదా ఆకాశములో లేదా సముద్రంలో అల్లాహ్ వాక్యములతో ఆయన సృష్టించిన ప్రతీ కీడు నుండి ఎక్కువగా శరణు వేడుకోవటం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«مَن نَزَلَ مَنْزِلًا فَقالَ: أَعُوذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِن شَرِّ ما خَلَقَ، لَمْ يَضُرَّهُ شَيءٌ حتَّى يَرْتَحِلَ مِن مَنْزِلِهِ ذَلِكَ».
“ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”.
అందులో నుంచి ఉదయపు మొదటి వేళలో, రాత్రి మొదటి వేళలో ప్రతీ ముస్లిం ఈ దుఆను మూడు సార్లు పఠించటం:
«بِسْمِ اللهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيءٌ فِي الأَرْضِ وَلَا فِي السَّمَاءِ، وَهُوَ السَّمِيعُ العَلِيمُ».
అల్లాహ్ నామముతో ఆరంభిస్తున్నాను. ఆయన నామముతో భూమ్యాకాశములలో ఏదీ నష్టం కలిగించదు. మరియు ఆయన సర్వం వినేవాడు, తెలుసుకునేవాడు.
ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రోత్సహం నిరూపించబడటం వలన మరియు ఇది ప్రతీ చెడు నుండి భద్రతకు కారణం అవటం వలన.
రెండవది: చేతబడి వాటిల్లిన తరువాత దాని వైద్యం చేయబడే విధానాలు, ఇవి కూడా అనేక విషయాల ద్వారా జరుగుతాయి:
మొదటిది: అల్లాహ్ ఎదుట తరచుగా లొంగిపోవడం, మరియు ఆయనను, సుబ్హానహు వ తఆలాను, వాటి ప్రభావం ద్వారా కలిగే నష్టాన్ని తొలగించమని, కష్టాన్ని తొలగించమని అర్ధించడం.
రెండవది: చేతబడి చేసిన వస్తువు నేలలో లేదా ఏదైన కొండలో లేదా ఇతర చోట ఎక్కడ ఉందో గుర్తించటం కోసం ప్రయత్నించాలి. దాన్ని తీసి నాశనం చేస్తే చేతబడి ప్రభావం నిర్వీర్యమైపోతుంది. ఇది చేతబడిని నయం చేసే అత్యంత ప్రయోజనకరమైన వైద్యం.
మూడవది: షరఈ రుఖయ్య, ఇందులో చాలా అజ్కార్లు మరియు దుఆలు ఉన్నాయి. వాటిలో కొన్ని:
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు రూఢీ చేయబడినది:
«اللَّهُمَّ رَبَّ النَّاسِ، أَذْهِبِ الْبَأْسَ، وَاشْفِ أَنْتَ الشَّافِي، لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ، شِفَاءً لَا يُغَادِرُ سَقَمًا».
«అల్లాహుమ్మ రబ్బన్నాస్’అజ్హిబిల్ బాస్’వష్ఫీ అంతష్శాఫీ ‘లా షిఫాఅ ఇల్లా షిఫాఉక షిఫా అన్ లా యుగాదిరు సఖమా’»
«ఓ అల్లాహ్! మనుషుల ప్రభువా! నీవే బాధను తొలగించువాడివి. నీవే చికిత్సిచేయువాడివి. నీ వైద్యం తప్ప మరొక వైద్యం లేదు. నీ చికిత్సతో అన్ని రోగాలు అంతమవుగాక». ఆయన దీనిని మూడు సార్లు పఠించేవారు.
జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై రుఖయా చేసిన దుఆలలో నుంచి ఇది కూడా ఉన్నది ఆయన ఇలా పలికారు:
«بِسْمِ اللَّهِ أَرْقِيكَ، مِنْ كُلِّ شَيْءٍ يُؤْذِيكَ، وَمِنْ شَرِّ كُلِّ نَفْسٍ أَوْ عَيْنِ حَاسِدٍ، اللَّهُ يَشْفِيكَ، بِسْمِ اللَّهِ أَرْقِيكَ».
«బిస్మిల్లాహి అర్ఖీక, మిన్ కుళ్లి షైఇన్ యుజీక, వ మిన్ షర్రి కుళ్లి నఫ్సిన్ ఔ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్ఖీక». అల్లాహ్ పేరుతో నేను నీకు రుఖ్యా చేస్తున్నాను, నిన్ను బాధించే ప్రతి దాని నుండి మరియు ప్రతి ఆత్మ యొక్క లేదా అసూయపడే కంటి యొక్క చెడు నుండి, అల్లాహ్ నిన్ను స్వస్థపరచుగాక, అల్లాహ్ పేరుతో నేను నీకు రుఖ్యా చేస్తున్నాను. ఈ విధంగా మూడు సార్లు పునరావృతం చేయాలి.
మరియు ఇది - ఆ మనిషి ఎవరైతే భార్యతో సంభోగము చేయటం నుండి ఆపబడ్డాడో అతని కొరకు ప్రయోజనకరమైన వైద్యము: ఏడు పచ్చని రేగు ఆకులను తీసుకుని వాటిని రాయితో లేదా వేరేవాటితో నూరాలి. వాటిని ఒక పాత్రలో వేసి అందులో స్నానానికి అవసరమైన నీటిని వేయాలి. మరియు అందులో
ఆయతుల్ కుర్సీ (2:255) మరియు
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ1﴾
ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా! [కాఫిరూన్ 109:1], మరియు
﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ1﴾
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. [అల్-ఇఖ్లాస్ 112:1] మరియు
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ1﴾
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను. [అల్-ఫలఖ్ 113:1] మరియు
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ1﴾
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను! [అన్నాస్ 114:1]
మరియు సూరతుల్ ఆరాఫ్ లో చేతబడి గురించి వచ్చిన ఆయతులు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَلۡقِ عَصَاكَۖ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ117 فَوَقَعَ ٱلۡحَقُّ وَبَطَلَ مَا كَانُواْ يَعۡمَلُونَ118 فَغُلِبُواْ هُنَالِكَ وَٱنقَلَبُواْ صَٰغِرِينَ119﴾
మేము మూసాకు: "నీ చేతికర్రను విసురు." అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికుల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగి వేసింది.
ఈ విధంగా సత్యం స్థాపితమయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది.
ఈ విధంగా వారు అక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు. [అల్-అఅ్-రాఫ్ 7:117-119]
మరియు సూరహ్ యూనుస్ యొక్క ఆయతులు అవి: మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَقَالَ فِرۡعَوۡنُ ٱئۡتُونِي بِكُلِّ سَٰحِرٍ عَلِيمٖ79 فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالَ لَهُم مُّوسَىٰٓ أَلۡقُواْ مَآ أَنتُم مُّلۡقُونَ80 فَلَمَّآ أَلۡقَوۡاْ قَالَ مُوسَىٰ مَا جِئۡتُم بِهِ ٱلسِّحۡرُۖ إِنَّ ٱللَّهَ سَيُبۡطِلُهُۥٓ إِنَّ ٱللَّهَ لَا يُصۡلِحُ عَمَلَ ٱلۡمُفۡسِدِينَ81 وَيُحِقُّ ٱللَّهُ ٱلۡحَقَّ بِكَلِمَٰتِهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡمُجۡرِمُونَ82﴾
మరియు ఫిర్ఔన్ (తన వారితో) అన్నాడు: "నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి నా వద్దకు తీసుకురండి!
మాంత్రికులు వచ్చిన తరువాత మూసా వారితో: "మీరు విసర దలచుకున్న వాటిని విసరండి!" అని అన్నాడు.
వారు విసరగానే మూసా: "మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్ దానిని భంగ పరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరుల కార్యాలను చక్కబడనివ్వడు.
మరియు అల్లాహ్ తన ఆజ్ఞతో సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు, అది అపరాధులకు ఎంత అసహ్యకరమైనా సరే! [٣٨ 10:79-82]
మరియు సూరతు తాహాలోని ఆయతులు:
﴿قَالُواْ يَٰمُوسَىٰٓ إِمَّآ أَن تُلۡقِيَ وَإِمَّآ أَن نَّكُونَ أَوَّلَ مَنۡ أَلۡقَىٰ65 قَالَ بَلۡ أَلۡقُواْۖ فَإِذَا حِبَالُهُمۡ وَعِصِيُّهُمۡ يُخَيَّلُ إِلَيۡهِ مِن سِحۡرِهِمۡ أَنَّهَا تَسۡعَىٰ66 فَأَوۡجَسَ فِي نَفۡسِهِۦ خِيفَةٗ مُّوسَىٰ67 قُلۡنَا لَا تَخَفۡ إِنَّكَ أَنتَ ٱلۡأَعۡلَىٰ68 وَأَلۡقِ مَا فِي يَمِينِكَ تَلۡقَفۡ مَا صَنَعُوٓاْۖ إِنَّمَا صَنَعُواْ كَيۡدُ سَٰحِرٖۖ وَلَا يُفۡلِحُ ٱلسَّاحِرُ حَيۡثُ أَتَىٰ69﴾
వారు (మాంత్రికులు) ఇలా అన్నారు: "ఓ మూసా! నీవు విసురుతావా, లేదా మేము మొదట విసరాలా?
(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి.
దానితో మూసాకు, తన మసనస్సులో కొంత భయం కలిగింది67.
మేము (అల్లాహ్) అన్నాము: "భయపడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు.68
నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!
[తాహా 20:65-69]
ఈ తెలియపరచబడిన ఆయతులను పఠించి నీళ్లలో ఊదిన తరువాత దాని నుండి మూడు గుటుకల నీటిని త్రాగి మిగిలిన వాటితో స్నానం చేయాలి. దీని ద్వారా అల్లాహ్ తలచుకుంటే రోగము నయం అవుతుంది. ఒక వేళ రెండూ లేదా ఎక్కువ సార్లు దాన్ని ఉపయోగించే అవసరమే ఉంటే రోగం నయం అయ్యే వరకు చేయటంలో ఎటువంటి దోషం లేదు.
ఈ అజ్'కారులు మరియు శరణు వేడుకునే దుఆలు మరియు మార్గాలు చేతబడి మరియు ఇతరత్రా కీడు నుండి జాగ్రత్త పడటానికి గొప్ప కారకాలు. మరియు అవి చేతబడి సంభవించిన తరువాత దానిని తొలగించటానికి గొప్ప ఆయుధాలు కూడాను. వాటిపై నిజహృదయంతో విశ్వాసమును కలిగి ఉండి, అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండి, ఆయనపై ఆధారపడుతూ, అవి దేనిపైనైతే సూచిస్తున్నాయో వాటిని అర్ధం చేసుకుని వాటి పట్ల శ్రద్ధ వహించే వారి కొరకు.
ఈ విషయాలను తెలియచేయటం అవసరము - వేటితోనైతే చేతబడి నుండి జాగ్రత్తగా ఉండవచ్చు మరియు వాటితో చేతబడి యొక్క వైద్యం చేయవచ్చు. వల్లాహు వలియ్యుత్తౌఫీఖ్.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వస్తుంది, అది చేతబడి చేసేవారి చర్యలతో సజర్ వైద్యం చేయటం, జిన్నులకు దగ్గరవటం ద్వారా జంతువును కోయటం లేదా ఇతరవాటిని బలి ఇవ్వటం వంటిది. ఇది సమ్మతం కాదు. ఎందుకంటే అది షైతాను చర్యల్లోంచిది. అంతేకాదు అది పెద్ద షిర్కులోంచిది. అలాగే జ్యోతిష్కులతో, బాబాలతో, పూజారులతో మరియు చేతబడి చేసేవారితో అడిగి వైద్యం చేయటం మరియు వారు చెప్పిన వాటిని ఉపయోగించటం సరి కాదు. ఎందుకంటే వారు విశ్వాసపరులు కారు మరియు వారు అబద్దపరులు, పాపాత్ములు. అగోచర విషయాల జ్ఞానం తమకు తెలుసని వాదించేవారు మరియు ప్రజలను మోసానికి గురిచేసేవారు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళటం నుండి, వారి వద్దకు వచ్చి అడగటం నుండి, వారు చెప్పిన వాటిని నిజమని నమ్మటం నుండి హెచ్చరించారు. దీని ప్రస్తావన ఈ పుస్తకం యొక్క ఆరంభంలోనే చేయబడింది. కాబట్టి, దాని నుండి జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రామాణికమైన హదీథులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయనను నష్రహ్ గురించి అడిగితే ఇలా సమాధానమిచ్చారు:
«هِيَ مِنْ عَمَلِ الشَّيْطَانِ».
అది షైతాను చర్యల్లోనిది, దీనిని ఇమామ్ అహ్మద్ మరియు అబూదావుద్ ప్రామాణిక సనద్ తో ఉల్లేఖించారు.
నష్ర అంటే చేతబడి చేయబడిన వాడి నుండి చేతబడిని నయం చేయటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశం ఆయన ఈ పలకులు : నష్ర ఏమిటంటే దానిని అజ్ఞానులు నిర్వహించేవారు. అది ఎలాగంటే చేతబడిని నయం చేయటానికి చేతబడి చేసేవాడిని అడగటం లేదా ఇంకొక చేతబడి చేసే వాడితో చేతబడిని దాని లాంటిదానితోనే నయం చేయటం.
ఇక చేతబడిని మంత్రించటం ద్వారా, ధార్మిక దుఆల ద్వారా నయం చేయటంలో ఎటువంటి దోషం లేదు. ఇంతకు ముందు దాని ప్రస్తావన వచ్చింది. మరియు దాని గురించి అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ మరియు ఫత్హుల్ మజీద్ లో అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ రహ్మతుల్లహి అలైహి ఖుర్ఆన్, హదీథులలోని ఆధారాలను తెలిపారు. ఇతర ధార్మిక విధ్వాంసులు కూడా దీని గురించి ఖర్ఆన్, హదీథులలోని ఆధారాలు తెలిపారు.
ముస్లిములకు ప్రతీ కీడు నుండి రక్షణ భాగ్యమును కలిగించమని, వారి ధర్మమును పరిరక్షించమని మరియు వారికి అందులో పరిజ్ఞానమును ప్రసాదించమని మరియు అల్లాహ్ ధర్మమునకు విరుద్ధమైన వాటి నుండి వారిని పరిరక్షించమని అల్లాహ్ ను అర్థిస్తున్నాము.
అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కలిగించుగాక.
***
ఈ వసీయత్ రిసాలా నంబరు 17 తో 1402వ హిజ్రీ సంవత్సరంలో రియాసతుల్ ఆమ్మ లి ఇదారాతిల్ బుహూసిల్ ఇల్మీయ్య వల్ ఇఫ్తా వద్ దావా వల్ ఇర్షాద్ ద్వారా ప్రచురించబడినది.